తెలంగాణ

telangana

Stock market: నాలుగో రోజూ నష్టాలే.. 58వేల దిగువకు సెన్సెక్స్

By

Published : Dec 15, 2021, 3:49 PM IST

Stock-market: దేశీయ స్టాక్​ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఓ దశలో బీఎస్​ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా కోల్పోయింది. ​చివరకు 329 పాయింట్లు నష్టపోయి 58వేల కిందికి దిగొచ్చింది.

stocks
స్టాక్​ మార్కెట్

స్టాక్ మార్కెట్లు (Stock Market) బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ (Sensex Today) 329 పాయింట్లు తగ్గి 57,788వద్ద స్థిరపడింది. నిఫ్టీ (Nifty Today) 115 పాయింట్ల నష్టంతో 17,210కు చేరింది.

ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు సహా.. అంతర్జాతీయ మిశ్రమ పవనాల నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాలతో సెషన్​ను ముగించినట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 58,218 పాయింట్ల అత్యధిక స్థాయి, 57,671 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,351 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 17,192 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లో..

Stock Market Top Gainers: సన్​ఫార్మా, కోటక్​ బ్ంయాక్, ఎం అండ్ ఎం​, మారుతీ​, ఎల్​ అండ్​ టీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

Stock Market Top Losers: బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఫిన్​సర్వ్​, ఐటీసీ, టీఎస్​ఎస్, టైటాన్​ డీలాపడ్డాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details