ETV Bharat / politics

తారాస్థాయికి చేరిన నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నిక ప్రచారం - GRADUATE MLC BY POLL CAMPAIGN

author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2024, 10:26 PM IST

Parties Speed UP MLC Election Campaign : నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఓట్ల వేట సాగిస్తున్నాయి. సన్నాహక సమావేశాలు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాలతో దూసుకుపోతున్నాయి. పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాయి.

Parties Speed UP MLC Election Campaign
Parties Speed UP MLC Election Campaign (ETV Bharat)

తారాస్థాయికి చేరిన నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నిక ప్రచారం (ETV Bharat)

Parties Speed UP MLC Election Campaign : పట్టభద్రుల ఉపఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. మహబూబాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం, జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్‌ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మహబూబాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన బీఆర్ఎస్​కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని మల్లన్న విమర్శించారు.

MLC Election Campaign by Congress Party Leaders : కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు మోహన్‌రెడ్డి, పూల రవీందర్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నిర్వహించిన డోర్నకల్ నియోజకవర్గ పట్టభద్రుల ఉపఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రాకేశ్​ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నేతల ప్రచారం : వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్​ నేతలు ఆ పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. హుజూర్‌నగర్‌లోనూ బీఆర్ఎస్​ నాయకులు ఓట్లు అభ్యర్థించారు. అబద్ధాలు చెప్పిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల్లో అబాసు పాలైందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పట్టభద్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు కోరారు.

"కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారట. ఆయన చేసినవన్నీ తీసేస్తారంట. తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం పెట్టారు. దాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తుందట. తీయిస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ది చెప్పండి. రాకేశ్ రెడ్డిని గెలిపించండి. ఆయన శాసనమండలిలో వరంగల్ ఆత్మగౌరవం కోసం పోరాడతారు"- హరీశ్​ రావు, బీఆర్ఎస్ నేత

గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తికి ఓటు వేస్తారో, బ్లాక్ మెయిల్ చేసే వ్యక్తికి వేస్తారో ఆలోచించండి : కేటీఆర్ - KTR MLC Election Campaign Nalgonda

BJP Kishan Reddy Comments On Congress : బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తరఫున ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. భూపాలపల్లిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయిల్ శంకర్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మాజీ ఎమ్మెల్యే కేవీ రత్నం ప్రేమేందర్‌రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి జనగామలో విమర్శించారు. బీఆర్ఎస్​, కాంగ్రెస్‌ పాలనకు తేడా లేకుండా పోయిందని దుయ్యబట్టారు.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెద్దవూరలో బీజేపీ సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ పట్టభద్రుల ఎన్నిక ప్రచారం నిర్వహించారు. దేవరకొండలో ఏర్పాటు చేసిన పట్టబద్రుల ఆత్మీయ సమ్మేళనంలోనూ పాల్గొన్నారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్​తో ఒరిగేది ఏమీ ఉండదని ఈసారి బీజేపీను ఆదరించాలని ఈటల కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - ఓట్లవేటలో దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు - GRADUATE MLC BYPOLL CAMPAIGN IN TS

'కాంగ్రెస్‌ పాలన కూడా కేసీఆర్ పాలన మాదిరే ఉంది - సన్న వడ్లకే బోనస్‌ ఇవ్వడంలో ఆంతర్యం ఏంటో?' - BJP Graduates MLC Election Campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.