తెలంగాణ

telangana

సంక్షోభంలో ఉన్న శ్రీలంక కోసం భారత సైన్యం.. నిజమేనా?

By

Published : Jul 11, 2022, 2:21 PM IST

శ్రీలంకకు భారత్ తన సైనిక బలగాలను తరలిస్తోందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని కొలంబోలోని భారత హైకమిషన్ వెల్లడించింది. అలాంటి ఉద్దేశమేదీ తమకు లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో శ్రీలంకకు అండగా ఉంటామని వివరించింది.

srilanka crisis
శ్రీలంక సంక్షోభం

శ్రీలంకకు భారత్‌ సైన్యాన్ని పంపనుందని వస్తున్న వార్తలను కొలంబోలోని భారత హై కమిషన్‌ ఖండించింది. అలాంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. గతంలో కూడా ఇలాంటి వదంతులే రాగా అప్పుడు కూడా భారత్‌ ఈ తప్పుడు వార్తలను ఖండించింది. కొన్ని ఛానళ్లు సహా సామాజిక మాధ్యమాల్లో శ్రీలంకకు భారత్‌ సైన్యాన్ని పంపుతుందనే వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ మేరకు కొలంబోలోని భారత్‌ హైకమిషన్‌ స్పష్టతనిచ్చింది. అలాంటి ఉద్దేశమేదీ భారత ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది.

ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రగతి కోసం తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజల పక్షాన భారత్ నిలుస్తుందని భారత హైకమిషన్‌ పేర్కొంది. ద్వీప దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి భారత్‌ అండగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసింది. ఇప్పటివరకు 3.8 బిలియన్‌ డాలర్ల సాయమందించామని ఇకపైనా ఈ సాయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details