Afghanistan Landslide Today : అఫ్గానిస్థాన్ కొండచరియలు విరిగిపడడం వల్ల 25మంది మరణించారు. మరో 10మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. నురిస్థాన్ ప్రావిన్స్లో సోమవారం వేకువజామున జరిగిందీ దుర్ఘటన.
భారీ వర్షం కారణంగా విరిగిపడ్డ కొండచరియలు
భారీ వర్షం, హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయని తాలిబన్ అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 20ఇళ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నూరిస్థాన్, కునార్, పంజ్షేర్ ప్రావిన్స్లలో రోడ్లు ధ్వంసమయ్యాయని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పారు.
కొండచరియలు విరిగిపడి 25మంది మృతి- ఇళ్లు, రోడ్లు ధ్వంసం
Published : Feb 19, 2024, 7:12 PM IST
|Updated : Feb 19, 2024, 9:24 PM IST
Afghanistan Landslide Today : కొండచరియలు విరిగిపడి 25మంది మరణించగా, మరో 10మంది గాయపడ్డారు. అఫ్గానిస్థాన్లో జరిగిందీ దుర్ఘటన.
కొండచరియలు విరిగిపడి 17మంది మృతి
Congo Landslide :కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందిన ఘటన కాంగోలో కొన్నాళ్ల క్రితం జరిగింది. భారీ వర్షాల ధాటికి ఒక్కసారిగా విరిగిపడ్డ కొండచరియలు కొండ కింది ప్రాంతాల్లో ఉన్న నివాస గృహాలను కప్పేసాయి. దీంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వాయువ్య మంగల ప్రావిన్స్లోని లిసాల్ పట్టణంలో కాంగో నది తీరప్రాంత పరిసరాల్లో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనతో లిసాల్ పట్టణంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
శిథిలాల కింద చిక్కుకున్న 47మంది
China Landslide: చైనాలోని పర్వత ప్రాంతమైన యునాన్ ప్రావిన్స్లో కొన్నాళ్ల క్రితం కొండచరియలు విరిగిపడి 47 మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. ఈ ఘటన ఝాటోంగ్ నగరంలోని లియాంగ్షుయ్ గ్రామంలో జరిగింది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విరిగిపడిన కొండచరియల్లో ఇరుక్కుపోయిన వారిని రక్షించడం కోసం దాదాపు 200 మంది రెస్క్యూ సిబ్బంది 33 అగ్నిమాపక వాహనాలు, 10 లోడింగ్ మెషీన్లను ఘటనా స్థలానికి తరలించారు. 500 మందిని ఘటనా స్థలం నుంచి సురక్షిత ప్రాంతాలనకు తరలించారు. ఈ ఘటనలో పలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.