ETV Bharat / state

KTR Speech at Assembly Sessions 2023 : 'సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత.. తప్పైతే వచ్చే ఎన్నికల్లో ఓడించండి'

author img

By

Published : Aug 5, 2023, 5:49 PM IST

KTR Speech at Assembly Sessions 2023 : తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమతుల్య, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి అని.. తాను చెప్పింది తప్పయితే వచ్చే ఎన్నికల్లో తమను ఓడించండని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సంక్షేమం తప్ప.. సంక్షోభం లేదని స్పష్టం చేశారు. పంటలకు నీళ్లు ఇచ్చే బీఆర్​ఎస్ కావాలా, మత మంటలు లేపే పార్టీ కావాలో ప్రజలు ఆలోచించాలని కేటీఆర్ పేర్కొన్నారు. నూటికి నూరు శాతం మూడోసారి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

KTR
KTR

KTR Speech at Assembly Monsoon Sessions 2023 : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మూడో రోజూ కొనసాగాయి. ఈ క్రమంలో ఇవాళ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో చర్చ జరిగింది. వాటిపై జరిగిన స్వల్పకాలిక చర్చకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమ, ఖర్చుల లెక్క మాత్రమేనని.. అదే బీఆర్​ఎస్​కు రాష్ట్ర ప్రజల జీవనరేఖ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మౌలిక వసతులపై బడ్జెట్‌లో 26 శాతం ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు.

KTR on Telangana Development : తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమతుల్య, సమీకృత, సమ్మిళిత అభివృద్ధి అని.. తాను చెప్పింది తప్పయితే వచ్చే ఎన్నికల్లో తమను ఓడించండని మంత్రి కేటీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనలో గ్రామాలు, పట్టణాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవారంగాలు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో సంక్షేమం తప్ప.. సంక్షోభం లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు కట్టు కథలకు విషపుత్రికలు అని శ్రీశ్రీ అన్నారన్నారు.

'తెలంగాణలో సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత అని చెప్పక తప్పదు. తెలంగాణలోని ఏ పల్లెలో, పట్టణంలో చూసినా సంక్షేమం.. సంతోషమున్నది తప్ప సంక్షోభం లేదు. కాంగ్రెస్‌లో మాత్రమే సంక్షోభం ఉంది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో 30 శాతం తెలంగాణకే వచ్చాయి. ములుగు జిల్లా ఉత్తమ జిల్లా పరిషత్‌ అని కేంద్రమే ప్రకటించింది. కాంగ్రెస్‌ హయాంలో గ్రామాల్లో పెట్టిన ఖర్చు రూ.6 వేల కోట్లు మాత్రమే. గత 9 ఏళ్లలో ఈ ప్రభుత్వం రూ.29 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. కాంగ్రెస్‌ హయాంలో మానేరు ఒడ్డున ఉన్నవారికి కూడా మంచినీరు అందేది కాదు. కాంగ్రెస్ 60 ఏళ్లల్లో చేయని పనులను 6 ఏళ్లల్లోనే చేసి చూపించాం.'-కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి

భట్టి ఉంటున్న ఇంట్లో మీటరు చెడిపోయింది : నీళ్ల కోసం రోజుకొక ట్యాంకర్ తెచ్చుకుంటున్నామన్న భట్టి వ్యాఖ్యలు అవాస్తవమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన ఉంటున్న ఇంట్లో మంచి నీటి మీటర్ చెడిపోయిందన్న కేటీఆర్.. అందువల్లే రూ.2.90 లక్షల నీటి బిల్లు చెల్లించాల్సి వచ్చిందన్నారు. 2022 జనవరి నుంచి భట్టి విక్రమార్క ఒక్క ట్యాంకర్ కూడా బుక్ చేయలేదని పేర్కొన్నారు. మీటర్‌ పని చేసి ఉంటే.. భట్టి ఇంటికి కూడా ఉచిత మంచినీటి పథకం వర్తించేదన్నారు. భట్టి కేవలం బుకాయించారన్నారు. నగరంలో ప్రతి ఒక్కరికీ 20 వేల లీటర్ల మంచినీరు ఉచితంగా ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు.

Harish Rao Speech at Telangana Assembly : 'తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రభాగాన రాష్ట్రం.. ఆర్థిక క్రమశిక్షణ వల్లే ఇదంతా'

'రాష్ట్రంలో 24 వేల ఆవాసాలకు నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా లక్షన్నర కిలోమీటర్ల పైపులైన్లు వేశాం. ఒక్క డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇల్లు ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానం. రాష్ట్రవ్యాప్తంగా 2.28 లక్షల రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. గృహలక్ష్మి పథకం కింద మరింత మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం చేయనున్నాం. పదేళ్లల్లో పురపాలకశాఖ ఆధ్వర్యంలో రూ.1.22 లక్షల కోట్లు ఖర్చు చేశాం. కేంద్రం ఒక మిథ్య అని ఎన్టీఆర్‌ ఏనాడో చెప్పారు. తెలంగాణకు కేంద్రప్రభుత్వం చేసిందేమీ లేదు.'-కేటీఆర్‌, ఐటీ శాఖ మంత్రి

ప్రభుత్వం చేసిన మంచి పనులను విపక్షాలు గుర్తించాలి : కాంగ్రెస్‌ బాగా చేసి ఉంటే హైదరాబాద్‌ ప్రజలు ఎందుకు తిరస్కరించారని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న నగరాన్ని తామంటే.. తాము నిర్మించామని చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ చేసిన కొన్ని మంచి పనులను తాము గుర్తించి ప్రశంసించామన్న కేటీఆర్.. ఈ ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా విపక్షాలు గుర్తించి ఒప్పుకోవాలన్నారు. గుజరాత్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఇప్పటికీ పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటించారని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో గుర్తు చేశారు. ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే డీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. చిన్నచిన్న పట్టణాల్లో కూడా డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని సిద్ధంగా ఉంచామని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

'రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్‌లో 35 ఫ్లైఓవర్లు నిర్మించింది. కేంద్రప్రభుత్వం హైదరాబాద్‌లో రెండు ఫ్లైఓవర్లు నిర్మించలేకపోయింది. కేంద్రం చేపట్టిన ఉప్పల్‌, అంబర్‌పేట ఫ్లైఓవర్లలో కొన్నేళ్లుగా పనులు సాగట్లేదు. కేంద్రానికి తెలంగాణ చెల్లించే రూపాయిలో తిరిగి వచ్చేది 40 పైసలు మాత్రమే. తెలంగాణ చెల్లించే పన్నులతో యూపీ, గుజరాత్‌, బిహార్‌లో నిర్మాణాలు జరుగుతున్నాయి. పంటలకు నీళ్లు ఇచ్చే బీఆర్​ఎస్ కావాలా, మత మంటలు లేపే పార్టీ కావాలో ప్రజలు ఆలోచించాలి. బీఆర్​ఎస్ ప్రభుత్వ విధానాల వల్లే హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి సంస్థలు వస్తున్నాయి. రూ.100 కోట్లు పెట్టి ఎకరం భూమి కొనేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి.'-కేటీఆర్‌, పురపాలక శాఖ మంత్రి

జగన్‌, చంద్రబాబుకు అర్థమైన విషయాలు విపక్షాలకు అర్థం కావట్లేదు : హైదరాబాద్‌ అభివృద్ధిని, భూముల విలువను చంద్రబాబు గుర్తించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనవచ్చు అని చంద్రబాబు అన్నారన్న ఆయన.. కేసీఆర్‌కు రైతులపై ప్రేమ ఉన్నందునే మీటర్లకు ఒప్పుకోలేదని చంద్రబాబు అన్నారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ఒప్పుకున్న చంద్రబాబు, శాంతిభద్రతలు మెచ్చుకున్న జగన్​కు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణలో శాంతిభద్రతలను ఏపీ సీఎం జగన్‌ కూడా మెచ్చుకున్నారన్నారు. దిశ ఘటన విషయంలో 'ఐ సెల్యూట్‌ టు కేసీఆర్‌' అని జగన్ అన్నారని వ్యాఖ్యానించారు. జగన్‌, చంద్రబాబుకు అర్థమైన విషయాలు విపక్షాలకు అర్థం కావట్లేదన్నారు.

Telangana Assembly Passes Rejected Bills : బిల్లుల పునఃఆమోదం.. గవర్నర్​ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రుల ఆక్షేపణ

Telangana Assembly Sessions 2023 : అసెంబ్లీ సమావేశాల వేళ ఆసక్తికర సన్నివేశాలు.. ఈటల, జగ్గారెడ్డితో మంత్రి కేటీఆర్ ముచ్చట్లు

BRS on Telangana Assembly Elections 2023 : విపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా BRS దూకుడు.. హ్యాట్రిక్ దిశగా కేసీఆర్ కీలక నిర్ణయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.