Bhatti Vikramarka on Telangana Govt : 'తెలంగాణలో ఇక సర్కారు జాగాలుండవు.. అన్నీ బీఆర్ఎస్ భూములే'

By

Published : Aug 4, 2023, 2:26 PM IST

thumbnail

Bhatti Vikramarka Fires on Telangana Govt : రాష్ట్రంలో గానీ, హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూములు అనేవి ఏమీ మిగలవని.. ప్రభుత్వరంగ ఆస్తులు కూడా ఇకపై ఏమీ ఉండవంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ భూముల అమ్మకాన్ని బీఆర్ఎస్‌ పార్టీ ఓ ఉద్యమంలా చేపడుతోందని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో భూములు అమ్మకాన్ని వ్యతిరేకించిన.. భారత్ రాష్ట్ర సమితి పెద్దలే.. ఇప్పుడు వేల ఎకరాలు అమ్ముతున్నారని విమర్శించారు. ప్రజలకు చెందిన భూమిని ఇష్టానుసారంగా వినియోగించుకోవడానికి వారికేం హక్కుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ప్రజల పక్షాన నిలబడుతుంది. ఆస్తుల అమ్మకానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో ఎజెండా ఏంటో ముందే చెప్పకుండా.. అప్పటికప్పుడు చెబితే ఎలా అని నిలదీశారు. చర్చ లేకుండా వాళ్ల ప్రచారం కోసమే సభ పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రశ్నోత్తరాలలో తమకు సమయం ఇవ్వడం లేదని.. అధికార పార్టీ సభ్యులకు మాత్రమే స్పీకర్‌ అవకాశం ఇస్తున్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.