దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్'(రౌద్రం రణం రుధిరం) విడుదల వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించారు. ప్రాణాంతక కరోనా వల్ల ప్రస్తుతం చిత్రీకరణ నిలిచిపోయింది. మళ్లీ సెట్స్పైకి వెళ్లేందుకు కొంచెం సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర విడుదల ముందుకు జరిగిందని సమాచారం. వచ్చే సంవత్సరం వేసవికి తీసుకురావాలని నిర్మాతలు భావిస్తున్నారని టాక్.
ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. చరణ్.. అల్లూరి సీతారామరాజు, తారక్.. కొమరం భీమ్ పాత్రల్లో కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి : వీర మహిళలకు నటి ప్రియాంక లక్ష డాలర్లు