ETV Bharat / bharat

టైర్​ పేలి ట్రక్కును ఢీకొన్న కారు- 8మంది మృతి- మరో ప్రమాదంలో ఆరుగురు మరణం - Road Accident

author img

By ETV Bharat Telugu Team

Published : May 16, 2024, 9:03 AM IST

Updated : May 16, 2024, 10:42 AM IST

Road Accident In Indore : మధ్యప్రదేశ్​​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. ఒడిశాలో రెండు ట్రక్కుల మధ్య కారు ఇరుక్కుపోవడం వల్ల ఆరుగురు మరణించారు. మరో బస్సు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు.

Road Accident In Indore
Road Accident In Indore (ETV Bharat)

Road Accident In Indore : మధ్యప్రదేశ్​​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఓ ట్రక్కును ఢీ కొనడం వల్ల 8మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన ఇందౌర్- అహ్మదాబాద్​ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హుటాహుటిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కారు టైర్​ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ధార్ జిల్లాకు చెందిన కొందరు ఇందౌర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై కారులో వెళ్తుండగా ఘటాబిలోడ్ బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు గుణ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్ సైతం ప్రాణాలు విడిచారు. 'మృతదేహాలు కారులో చిక్కుకున్నాయి. గ్రామస్థుల సాయంతో వాటిని అతి కష్టం మీద కారులో నుంచి తీశాం. క్షతగాత్రుడ్ని ఇందౌర్​లోని ఎంవై ఆస్పత్రికి తరలించాం. అతడి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించి వారి కుటుంబాలకు అప్పగిస్తాం' అని పోలీసులు తెలిపారు.

ఒడిశాలో ఘోర ప్రమాదం- ఆరుగురు మృతి
Road Accident In Odisha : ఒడిశాలోని కియోంజర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఆరుగురు ప్రాణాలు విడిచారు. బుధవారం రెండు ట్రక్కుల మధ్య ఓ కారు ఇరుక్కోవడం వల్ల జరిగిందీ దుర్ఘటన. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం పరీక్షలకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

లారీని ఢీకొన్న బస్సు- వెనుక నుంచి మరో వాహనం ఢీ
Bus Accident in Chennai : తమిళనాడులో జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది గాయపడ్డారు. చెన్నైలోని మధురాంతకంలో ఓమ్నీ బస్సు గురువారం వేకువజామున అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. అంతలోనే వెనుకనుంచి వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు ఓమ్నీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 20 మంది ప్రయాణికుల్ని చెంగల్పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

'ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు- సాధారణం కంటే ఎక్కువ వర్షాలు'- IMD గుడ్​న్యూస్​ - Southwest Monsoon

'ప్రధాని మోదీకి స్పెషల్ థ్యాంక్స్​'- CAA అమలయ్యాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం - Citizenship Amendment Act

Last Updated :May 16, 2024, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.