ETV Bharat / politics

లోక్​సభ పోరు ముగిసింది - ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధాన పార్టీల గురి - Telangana Graduate MLC By Election

author img

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 8:31 AM IST

Graduate MLC By Election 2024 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు గురిపెట్టాయి. ఈ ఎన్నికల బరిలో 52 మంది ఉండగా, ఈ నెల 27న పోలింగ్​ జరగనుంది. ఇందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

Telangana Graduate MLC By Election
Telangana Graduate MLC By Election (ETV Bharat)

Telangana Graduate MLC By Election : లోక్​సభ ఎన్నికలు ముగిశాయి. ఇక అంతా ప్రశాంతంగా ఉంటుందనుకున్న ప్రధాన పార్టీలకు వరంగల్​-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. ఇప్పుడు పార్టీలు ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టిని సారించాయి. ఈ ఎన్నికల బరిలో 52 మంది ఉండగా, ఈ నెల 27వ తేదీన పోలింగ్​ జరగనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీలు తమ ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో మూడు పార్టీలు ఉన్నాయి.

సీఎం రేవంత్​ వరుస సమీక్షలు : ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దఫా ఈ స్థానాన్ని ఛేజిక్కించుకోవాలని సీఎం రేవంత్​ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ మూడు జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్​లకు ప్రచార బాధ్యతలను అప్పగించడమే కాకుండా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. అధికార పార్టీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడమే కాకుండా తాజాగా నకిరేకల్​, ఆలేరుల్లో పార్టీ అభ్యర్థి తీన్మార్​ మల్లన్న, స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు, కార్యకర్తలను కలిసి సమీక్షలు నిర్వహిస్తున్నారు.

రంగంలోకి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి : మరోవైపు ప్రతిపక్ష బీఆర్​ఎస్​ నుంచి అభ్యర్థిగా ఉన్న ఏనుగుల రాకేశ్​ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ఆయనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్సీ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​ రెడ్డి ప్రచార వ్యూహాలను ఖరారు చేస్తున్నారు. ఈ స్థానం నుంచి ఆయన రెండుసార్లు గెలుపొందగా, ఉమ్మడి జిల్లాల్లోని నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో పార్టీ అధినాయకత్వం సైతం పల్లా రాజేశ్వర్​ రెడ్డికే ముఖ్య బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్​ సైతం బుధవారం హైదరాబాద్​లో పూర్వ జిల్లాల నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ స్థానాన్ని మూడోసారి గెలవాలని బీఆర్​ఎస్​ తన వ్యూహాలకు పదును పెడుతుంది.

పాత అభ్యర్థితో బరిలో బీజేపీ : గత ఎన్నికల్లో పోటీ చేసిన గుజ్జుల ప్రేమేందర్​ రెడ్డినే బీజేపీ ఈసారి కూడా బరిలో నిలిపింది. లోక్​సభ ఎన్నికల్లో నెలకొన్న సానుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా గెలుపు అవకాశాలను బీజేపీ మెరుగు పర్చుకుంది. అలాగే తన వ్యూహాలకు సైతం పదును పెట్టి ఈసారి ఎలాగైనా గెలుపొందాలని చూస్తోంది. ఉమ్మడి నల్గొండ ఇంఛార్జులుగా పార్టీ అధిష్ఠానం ఎమ్మెల్సీ ఏవీఎన్​ రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​ నేతలను నియమించింది.

మమ్మల్ని తిట్టి మీరెందుకు అప్పులు చేస్తున్నారు? : కేటీఆర్‌ - KTR Review Meeting on MLC ElECTION

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక - బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి - GRADUATE MLC BY POLL BJP CANDIDATE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.