ETV Bharat / state

అన్నదాతలకు గుడ్​న్యూస్ - రుణమాఫీపై కదలిక - అర్హుల జాబితా రూపకల్పనలో అధికారుల నిమగ్నం - 2 Lakh Rythu Runa Mafi

author img

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 9:32 AM IST

Telangana Govt Working to Implement Farmer Loan Waiver : రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీ అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ దిశగా బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఎప్పటిలోగా రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందో ఇప్పటికే వివరాలు ప్రకటించారు. ప్రక్రియకు సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Farmer Loan Waiver
2 Lakh Rythu Runa Mafi (ETV Bharat)

2 Lakh Rythu Runa Mafi in Telangana 2024 : ఆగస్టు 15వ తేదీలోగా రూ.2 లక్షలలోపు పంట రుణాలు మాఫీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. తాజాగా లోక్​సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన కసరత్తు మొదలైంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై కూడా అధికారులతో రేవంత్‌ రెడ్డి చర్చించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేయాల్సిందేనని, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ఎప్పటిలోగా రుణాలు తీసుకున్న వారికి మాఫీ వర్తిస్తుందో ఇప్పటికే వివరాలు ప్రకటించారు. ప్రక్రియకు సంబంధించిన పూర్తిస్థాయి విధివిధానాలను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. కుటుంబంలో ఒక రైతుకు పరిమితం చేస్తారా? లేదా ఎంత మంది తీసుకుంటే అంత మందికి మాఫీ వర్తింపజేస్తారా? అనేది తేల్చాలి. ఏప్రిల్‌ 1, 2019 నుంచి డిసెంబరు 10, 2023 మధ్య రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న, రెన్యువల్‌ చేసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుందని లోగడ ప్రభుత్వం ప్రకటించింది.

రైతులకు గుడ్​ న్యూస్​ - కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు - Rythu Bharosa Scheme

రైతు రుణమాఫీ దిశగా కసరత్తు : దీని ప్రకారం అర్హులైన వారి జాబితా పంపాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ)లను రాష్ట్ర అధికారులు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాంకులే పెద్ద ఎత్తున పంట రుణాలను మంజూరు చేశాయి. డీసీసీబీ ఖమ్మంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఆయా బ్యాంకుల్లో 1.75 లక్షల మంది పంట రుణాలు తీసుకున్నారు.

వీరిలో 80 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. సుమారు రూ.882.12 కోట్ల వరకు రుణమాఫీ వర్తించే అవకాశం ఉందని సమాచారం. మరో బ్యాంకు ఏపీజీవీబీ పరిధిలో ఖమ్మం జిల్లాలో 83 వేల మంది రైతులు రూ. 945.76 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 42 వేల మంది రూ. 448.35 కోట్ల రుణాలు పొందారు. వీటితో పాటు జాబితా తయారు చేయాలని ఒకట్రెండు రోజుల్లో ఇతర వాణిజ్య బ్యాంకులకు కూడా ఆదేశాలు రానున్నట్లు సమాచారం.

Govt Focus On Rythu Runa Mafi : గత ప్రభుత్వం రైతులకు నాలుగేళ్లలో దశల వారీగా రుణమాఫీ వర్తింపజేసింది. రూ.25 వేలు, రూ.50 వేలు, ఆ తర్వాత రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసింది. ఈ క్రమంలో రుణాలను సకాలంలో రెన్యువల్‌ చేయించని వారికి మాఫీ జరగలేదు. కొత్త ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్‌ తేదీల్లోనూ వీరికి చోటుదక్కలేదు. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి రైతులు సహకార సంఘాల్లో ఎక్కువగా ఉన్నారు. కుటుంబ అవసరాల కోసం భూములు అమ్ముకున్న వారు, పిల్లల పెళ్లిళ్ల అనంతరం హక్కులు బదలాయించిన వారిలో ఎవరైనా కటాఫ్‌ తేదీల మధ్య రుణాలు చెల్లిస్తే వారికి మాఫీ వర్తిస్తుంది. ఇతర అవసరాలకు అప్పులు చెల్లించి పట్టా పుస్తకాలు, డాక్యుమెంట్లు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు.

వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి : రేవంత్​ రెడ్డి - CM Revanth Reddy Review Meeting

జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి రాజధాని కాలపరిమితి - అపరిష్కృత విభజన అంశాలపై సీఎం రేవంత్​ ఫోకస్ - Telangana Cabinet Meeting May 18th

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.