LIVE : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్​రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Kishan Reddy Live

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 4:28 PM IST

Updated : Apr 20, 2024, 4:53 PM IST

thumbnail

BJP Leader Kishan Reddy Live From State Office : ఎన్నికల ప్రచారంలో అన్ని విషయాల్లో బీజేపీ ముందుందని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదు సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారని తెలిపారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించామన్నారు. బీఆర్ఎస్​ చాలా బలహీనపడిందని ఆ పార్టీ దాదాపు కనుమరుగైందని ఎద్దేవా చేశారు. ఓడిపోయి 5 నెలలు గడిచినా ఓటమిని కేసీఆర్‌, కేటీఆర్ ఇంకా అంగీకరించలేదని అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్‌ ఫ్రస్టేషన్‌లో ఉన్నారని అన్నారు. కుమార్తె లిక్కర్‌ కేసు, ఫోన్ల ట్యాంపింగ్‌ కేసుల్లో బీఆర్ఎస్​ కూరుకుపోయిందని తెలిపారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు బీజేపీను విమర్శిస్తోందని తెలిపారు. జై శ్రీరామ్‌ నినాదం అన్నం పెడుతుందా ఉద్యోగాలు ఇస్తుందా అని కేటీఆర్‌ అన్నారని గుర్తు చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని స్థితిలో బీఆర్ఎస్​ ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్​పైన కూడా విమర్శలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతున్నారు.

Last Updated : Apr 20, 2024, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.