LIVE : బీజేపీ నేతల మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - bjp leaders live
Published : May 14, 2024, 5:27 PM IST
|Updated : May 14, 2024, 5:32 PM IST
Kishan Reddy Press Meeting Live From Telangana BJP State Office : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. రాష్ట్రంలో దాదాపు 65 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియపై బీజేపీ నేతలు రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓటర్లు తమ ఓటును బాధ్యతగా వినియోగించుకున్నారని తెలుపుతున్నారు. ఎన్నికల సంఘం ప్రశాంతంగా ఎన్నికలను జరిపిందని చెబుతున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన ఎన్నికల సిబ్బంది వెంటనే వాటిని పరిష్కరించాయని తెలిపారు. తమ పార్టీ గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెమట్లో జరిగిన ఉపఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు అయిందని తెలుపుతున్నారు. మరిన్ని విషయాలను వెల్లడిస్తున్నారు. వచ్చే నెల 4వ తేదీన వెలువడే ఫలితాలు తమకు అనుకూలంగా వెలువడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.