తెలంగాణ

telangana

BJP Assembly Election Plan 2023 : 'బీసీ' నినాదంతో ఎన్నికల బరిలోకి కమలదళం.. 35 నుంచి 40 సీట్లు వారికే!

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 4:17 PM IST

BJP Assembly Election Plan 2023 : బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగేందుకు కమల దళం ప్రణాళికలు రచిస్తోంది. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. బీసీల ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నాయకత్వం.. 88 నియోజకవర్గాల్లో 35 నుంచి 40 టికెట్లు బీసీలకు కేటాయించే యోచనలో ఉంది.

Telangana Assembly Elections 2023
BJP Assembly Election Plan 2023

BJP Assembly Election Plan 2023 :అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగాభారతీయ జనతా పార్టీ(Telangana BJP) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల కసరత్తులో నిమగ్నమైన ఆ పార్టీ నాయకత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకునేందుకు సిద్ధమైంది. బీసీ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగేందుకు కమలదళం ప్రణాళికలు రచిస్తోంది.

BJP MLA Candidate Selections : ఈ నెల 15 లేదా 16న.. బీజేపీ మొదటి జాబితా అభ్యర్థుల ప్రకటన

Telangana Assembly Elections 2023 : ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న ఆ పార్టీ నాయకులు.. ఎన్నికల ప్రచారంలో ఇదే నినాదంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బీసీల ఓట్లే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నాయకత్వం.. 88 నియోజకవర్గాల్లో 35 నుంచి 40 టికెట్లు బీసీలకు కేటాయించే యోచనలో ఉంది. అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు 5 టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో కీలక బీసీ నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుంటున్నారు. నిన్న నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో వీరశైవ లింగాయత్‌ రాష్ట్ర అధ్యక్షుడు వన్నె ఈశ్వరప్ప.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి, ఎంపీ లక్ష్మణ్​ ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్​ మాట్లాడుతూ.. బీజేపీ రాజకీయంగా బీసీలకు పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు.

BJP BC Plan :రాబోయే ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ, రేవంత్​రెడ్డిలకు బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బీసీలకు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చిన కేసీఆర్‌, కేటీఆర్‌.. బీసీ ద్రోహులేనని దుయ్యబట్టారు. గత ఆదివారం పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన ముదిరాజ్​ సభకు బీజేపీ నేత ఈటల రాజేందర్​ హాజరయ్యారు.

రాష్ట్రంలో అధికశాతం ఉన్న బీసీ ప్రజలకు ఎన్నికల్లో అన్యాయం జరుగుతోందని ఈటల దుయ్యబట్టారు. ఓట్లు మావే సీట్లు మావే అనే విధంగా కొట్లాడాలి తప్ప.. నేతలకు జేజేలు కొడితే బతుకులుమారవని ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉన్న అంశంపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించట్లేదని నిలదీశారు. ముదిరాజ్‌లకు బీఆర్​ఎస్​ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.

జనాభా దమాసా ప్రకారంగా 11 ఎమ్మెల్యే సీట్లు ఈటల ఇవ్వాలన్నారు. బీసీలకు 9 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ముగ్గురికి మాత్రమే ఇవ్వడంపై అయన సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఓట్లు మావే సీట్లు మావే అనే నినాదాం ఇవ్వాలని ముదిరాజులకు పిలుపునిచ్చారు. పదేళ్లుగా ఆదివాసులకు మంత్రి పదవి ఇవ్వలేదని మండిపడ్డారు.

BJP Telangana Election Committees 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. బీజేపీ 14 కమిటీలు

Kishan Reddy Comments on BRS and Congress : 'ప్రజలు కుటుంబ పార్టీల పాలన కోరుకోవడం లేదు'

ABOUT THE AUTHOR

...view details