తెలంగాణ

telangana

నౌక ప్రమాదంలో 13 మంది మృతి

By

Published : Dec 25, 2021, 1:18 PM IST

Migrant Boat Capsizes: గ్రీస్​లో శుక్రవారం జరిగిన నౌక ప్రమాదంలో 13 మంది మృతిచెందారు. నౌకలో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు అంచనా వేశారు. వీరంతా టర్కీ నుంచి ఇటలీకి వలసవెళ్తున్నారని వెల్లడించారు.

Migrant Boat Capsizes
బోటు ప్రమాదంలో 13 మంది మృతి

Migrant Boat Capsizes: గ్రీస్​లోని అజియన్​ సముద్రంలో వలసదారులు ప్రయాణిస్తున్న నౌక శుక్రవారం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకరమైన దారిలో ప్రయాణించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు.

అధికారుల వివరాల ప్రకారం..

చాలా మంది వలసదారులు, శరణార్థులు అక్రమ రవాణాదారుల సాయంతో టర్కీ నుంచి ఇటలీకి ప్రయాణిస్తుంటారు. సముద్ర మార్గంలో టర్కీ నుంచి ఇటలీకి చేరుకోవాలంటే గ్రీస్​లోని అజియన్​ దీవుల​ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఉండే పటిష్ఠ భద్రత నుంచి తప్పించుకునేందుకు స్మగ్లర్లు ప్రయాణికులను ప్రమాదక మార్గాల నుంచి తరలిస్తారు. ఈ క్రమంలో నౌక ప్రమాదాలు జరుగుతున్నాయి.

తాజా నౌక ప్రమాదం పరోస్​ దీవికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ఘటన జరిగిన సమయంలో ఓడలో సుమారు 80 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదానికి గురైన ఆ నౌక నుంచి 62 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా.. 13 మంది మృతిచెందారు. మిగతా వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు.

అదే రోజు జరిగిన మరో ఘటనలో గ్రీక్​ పోలీసులు ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్​ చేశారు. వారు అక్రమంగా తరలిస్తున్న 92 మంది వలసదారులను అదుపులోకి తీసుకున్నారు.

మరో 11 మంది..

అంతకుముందు గురువారం కూడా.. అథెన్స్​కు 235 కిలోమీటర్ల దూరంలో ఓ నౌక ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందగా.. 90 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో 11 మంది మహిళలు, 27 మంది చిన్నారులు ఉన్నారు.

ఫోలెగాన్​డ్రోన్​ దీవి వద్ద జరిగిన మరో నౌక ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది గల్లంతయ్యారు. 13 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రయాణికులు ఇరాక్​కు చెందిన వారని అధికారులు వెల్లడించారు.

దీంతో ఈ వారంలో జరిగిన నౌక ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య 27కు చేరింది.

ఇదీ చూడండి :క్రిస్​మస్​ ప్రయాణాలపై ఒమిక్రాన్​ దెబ్బ.. వందల విమానాలు రద్దు

ABOUT THE AUTHOR

...view details