తెలంగాణ

telangana

వచ్చే ఏడాది చివరి నాటికి సాధారణ స్థితికి ప్రపంచం!

By

Published : Oct 30, 2020, 10:21 AM IST

కరోనా విజృంభణతో ప్రపంచం స్తంభించిపోయింది. దాదాపు అన్ని దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. కొన్ని నెలల్లో వ్యాక్సిన్​ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మళ్లీ సాధారణ జీవితం గడపడానికి ఎంత సమయం పడుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ దీనిపై స్పందించారు.
Life is likely to get back to normal by the end of next year, says Fauci
వచ్చే ఏడాది చివరి నాటికి సాధారణ స్థితికి ప్రపంచం!

కరోనా వ్యాక్సిన్​ కొన్ని నెలల్లో అందుబాటులోకి వచ్చినా.. ప్రపంచంలోని ప్రజలు సాధారణ జీవనం గడపడానికి మరింత సమయం పడుతుందన్నారు అమెరికాకు చెందిన ప్రముఖ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రజలు సాధారణ జీవితం గడపొచ్చని వివరించారు. మెల్​బోర్న్​ విశ్వవిద్యాలయంలో ప్యానెల్ చర్చ సందర్భంగా ఫౌచీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒకవేళ వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తే.. 2021 రెండు లేదా మూడో త్రైమాసికానికి పెద్ద ఎత్తున టీకాలు వేస్తామన్నారు ఫౌచీ.

అలాగే అధ్యక్ష ఎన్నికలను ఉద్దేశించి కూడా ఫౌచీ మాట్లాడారు. అమెరికాలో మాస్క్​ ధరించడం రాజకీయ నినాదంగా మారిందన్నారు. ఈ పద్ధతి మారాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details