ETV Bharat / sports

'ఒక్క మ్యాచ్​తో IPL ట్రోఫీ నెగ్గలేం- ప్లేఆఫ్స్​లో ఇంకా కసిగా ఆడాలి' - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 9:52 AM IST

Updated : May 23, 2024, 11:04 AM IST

Ambati Rayudu On Rcb: టీమ్​ఇండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత హాట్ కామెంట్స్​ చేశాడు. ఇవి సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

Ambati Rayudu On Rcb
Ambati Rayudu On Rcb (Source: Getty Images)

Ambati Rayudu On Rcb: 2024 ఐపీఎల్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించింది. రాజస్థాన్​తో బుధవారం జరిగిన కీలకమైన నాకౌట్ మ్యాచ్​లో ఆర్సీబీ ఓడింది. దీంతో తొలిసారి టైటిల్ సాధించాలన్న నెరవేరలేదు. కప్పు కోసం ఆర్సీబీ ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం టీమ్​ఇండియా మాజీ ప్లేయర్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్ వైరల్​గా మారాయి.

'సంబరాలు చేసుకోవడం, దూకుడుగా ఆడడం వల్ల ఐపీఎల్ కప్పు గెలవలేం. ప్లేఆఫ్స్​కు చేరగానే ట్రోఫీ రాదు. ఇక్కడ వరకు చేరడానికి ఎంత కష్టపడ్డారో ఫ్లేఆఫ్స్​లోనూ అంతే కసిగా, ఒక ప్రణాళిక ప్రకారం ఆడాలి. కేవలం చెన్నైపై నెగ్గినంత మాత్రాన ఐపీఎల్ టైటిల్ రాదు. వచ్చే సీజన్​లో మళ్లీ ప్రయత్నించండి' అని రాయుడు అన్నాడు. అయితే రీసెంట్​గా ఆర్సీబీ, లీగ్ దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో చెన్నైపై విజయం సాధించి ప్లేఆఫ్స్​కు చేరింది. మ్యాచ్​ అనంతరం చెన్నై ప్లేయర్లతో ఫ్రెండ్లీ షేక్​హ్యాండ్​కు రాకుండా ఆర్సీబీ ప్లేయర్లు సంబరాల్లో మునిగిపోయారు. దీంతో రీసెంట్​గా జరిగిన చెన్నైతో మ్యాచ్​ను ఉద్దేశించే రాయుడు ఈ కామెంట్స్​ చేశాడని ఆర్సీబీ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ, ఈ విషయంలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్ విషయానికొస్తే, రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో ఛేదించింది. యశస్వీ జైస్వాల్ (45 పరుగులు), రియాన్‌ పరాగ్‌ (36 పరుగులు) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లకు 172-8 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ (34 పరుగులు), విరాట్ కోహ్లీ (33 పరుగులు) ఇద్దరే ఫర్వాలేదనిపించారు.

ఈ విజయంతో రాజస్థాన్ క్వాలిఫయర్​- 2కు దూసుకెళ్లింది. మే 24న సన్​రైజర్స్​తో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్​కు చెన్నై స్టేడియం వేదిక కానుంది. ఇందులో నెగ్గిన జట్టు ఫైనల్​కు చేరుకోగా, ఓడిన టీమ్ ఇంటబాట పడుతుంది. చూడాలి మరి శుక్రవారం పోరులో ఎవరు గెలుస్తారో?

IPLకు దినేశ్ గుడ్​బై- రిటైర్మెంట్ ప్రకటించిన Dk

ఆర్సీబీ ఖేల్ ఖతం- ఎలిమినేటర్​లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ - IPL 2024

Last Updated : May 23, 2024, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.