తెలంగాణ

telangana

వారికి మాస్కు అక్కర్లేదు- ఫుల్​ కెపాసిటీతో థియేటర్లు రీఓపెన్​

By

Published : Feb 4, 2022, 7:19 PM IST

Updated : Feb 4, 2022, 7:46 PM IST

Relaxing COVID-19 restrictions: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో.. వేర్వేరు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షలు సడలిస్తున్నాయి. దిల్లీలో పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. కార్లలో ఒంటరిగా ప్రయాణించే డ్రైవర్లకు మాస్కులు అక్కర్లేదని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. నైట్​ కర్ఫ్యూ ఎత్తివేయాలని రాజస్థాన్​ ప్రభుత్వం నిర్ణయించింది.

relaxing COVID-19 restrictions, Schools in Delhi Reopen
relaxing COVID-19 restrictions, Schools in Delhi Reopen

Relaxing COVID-19 restrictions: దిల్లీలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కొవిడ్​ ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించింది అరవింద్ కేజ్రీవాల్​ ప్రభుత్వం. నైట్​ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతుందని, రాత్రి 10కి బదులు.. 11 గంటలకు మొదలవుతుందని స్పష్టం చేసింది.

  • నర్సరీ నుంచి అన్ని తరగతుల విద్యార్థుల కోసం పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. టీచర్లు వ్యాక్సిన్​ తప్పనిసరిగా వేయించుకోవాలి.
  • కార్లలో ఒంటరిగా ప్రయాణించే వారు మాస్కు ధరించాల్సిన అవసరం లేదు.
  • ఆఫీసుల్లో 100 శాతం హాజరుకు అనుమతి.

దిల్లీలో జనవరి 13న రికార్డుస్థాయిలో 28 వేల 867 కరోనా కేసులు నమోదయ్యాయి. తర్వాత 10 రోజుల్లోనే రోజువారీ కేసులు 10 వేల దిగువకు చేరాయి.

నైట్​ కర్ఫ్యూ ఎత్తివేత..

కొవిడ్​-19 ఆంక్షలను సడలించిన రాజస్థాన్​ ప్రభుత్వం.. నైట్​ కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

  • ఇండోర్​, బహిరంగ సమావేశాలకు గరిష్ఠంగా 250 మందికి అనుమతి కల్పిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 5న కొత్త రూల్స్​ అమలవుతాయని స్పష్టం చేసింది.
  • మతపరమైన ప్రదేశాల్లో గతంలో మాదిరిగానే.. భక్తులకు అనుమతి కల్పిస్తున్నట్లు తెలిపింది.

Theatres, gyms, yoga centres allowed

కేసులు తగ్గుతున్న క్రమంలో ఆంక్షలను సడలించిన కర్ణాటక ప్రభుత్వం.. తాజాగా మరిన్ని మినహాయింపులు ఇచ్చింది.

థియేటర్లు, జిమ్​లు, యోగా కేంద్రాలు, స్విమ్మింగ్​ పూల్స్​.. పూర్తి సామర్థ్యంతో నడుపుకోవచ్చని స్పష్టం చేసింది. ఆరోగ్య మంత్రి సహా ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం.. సీఎం బసవరాజ్​ బొమ్మై ఈ నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటకలో శుక్రవారం కొత్తగా 14,950 కేసులు, 53 మరణాలు నమోదయ్యాయి.

Kerala to commence offline classes for students

కేరళలో కూడా కరోనా కేసులు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం రోజు మరో 38 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. 595 మంది చనిపోయారు. కిందటి రోజుతో పోలిస్తే వైరస్​ వ్యాప్తి బాగానే తగ్గింది. పాజిటివిటీ రేటు కూడా 10 శాతానికి తగ్గినట్లు తెలిపారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్​.

ఈ తరుణంలో.. ఫిబ్రవరి 7 నుంచి పాఠశాలల్లో విద్యార్థుల భౌతిక హాజరుకు అనుమతించింది పినరయి విజయన్​ సర్కార్​. 10,11,12 తరగతుల విద్యార్థులు ఫిబ్రవరి 7 నుంచి, 1 నుంచి 9 తరగతుల విద్యార్థులు ఫిబ్రవరి 14 నుంచి స్కూళ్లకు వెళ్లొచ్చని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఇవీ చూడండి: లంగ్స్​లో ఇరుక్కుపోయిన లవంగం- ఏడేళ్ల తర్వాత బయటకు!

భార్య పోర్న్​ వీడియోలతో ఆనందం.. అదే డబ్బు సంపాదన మార్గం.. చివరకు..

'వాళ్లు పేపర్​పైనే సమాజ్​వాదీలు- రైతులకు చేసిందేమీ లేదు'

Last Updated :Feb 4, 2022, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details