తెలంగాణ

telangana

బోరుబావిలో 12ఏళ్ల బాలుడు.. 50 అడుగుల లోతులో మృత్యువుతో పోరాటం

By

Published : Jun 10, 2022, 10:33 PM IST

ఇంటి సమీపంలోని బోరుబావిలో 12 ఏళ్ల బాలుడు పడిపోయిన సంఘటన ఛత్తీస్​గఢ్​ జిల్లాలోని జాంజ్​గీర్​ చాంపా జిల్లాలో శుక్రవారం జరిగింది. బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

borewell
బోరుబావిలో 12ఏళ్ల బాలుడు

ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు ఓ 12 ఏళ్ల బాలుడు. ఈ సంఘటన జాంజ్​గీర్​ చాంపా జిల్లా, మాల్ఖరోదా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని పిహరీద్​ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఇంటి వద్ద తమ కుమారుడు కనిపించటం లేదని వేతుకుతుండగా.. బాలుడి అరుపులు విని బోరుబావిలో పడిపోయినట్లు గుర్తించారు కుటుంబ సభ్యులు. వెంటనే 112కు ఫోన్​ చేసి సమాచారం అందించారు. బాలుడు రాహుల్​ సాహూగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్.. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు ట్వీట్​ చేశారు. 'పిహరీద్​ గ్రామంలో బోరు బావిలో పడిపోయిన బాలుడిని సురక్షితంగా బయటకు తీసేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించాం. కలెక్టర్​, జిల్లా ఎస్పీ సంఘటనాస్థలంలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. రాహుల్​ సురక్షితంగా బయటపడాలని ప్రతిఒక్కరు ప్రార్థించాలి.' అని పేర్కొన్నారు.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరు బావి సుమారు 80 అడుగుల లోతు ఉండగా.. బాలుడు 50 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జేసీబీ సాయంతో బోర్​ బావి పక్కన గుంత తీసి బాలుడిని రక్షించే చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలీసులు, ఎన్​డీఆర్​ఎఫ్​, ఆరోగ్య విభాగం, పరిపాలన విభాగం అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు.

బాలుడు రాహుల్​ సాహూ
సహాయక చర్యలు

ఇదీ చూడండి:పక్షిని కాపాడేందుకు వెళ్లి ఇద్దరు మృతి.. లైవ్​ వీడియో!

ఆసుపత్రి నిర్లక్ష్యం.. ఒకరి శిశువు మరొకరికి.. మూడేళ్ల తర్వాత ఏమైందంటే?

ABOUT THE AUTHOR

...view details