ETV Bharat / bharat

ఆసుపత్రి నిర్లక్ష్యం.. ఒకరి శిశువు మరొకరికి.. మూడేళ్ల తర్వాత ఏమైందంటే?

author img

By

Published : Jun 10, 2022, 5:28 PM IST

Babies switched at birth: ఒకే పేరుతో ఉన్న ఇద్దరు మహిళలు.. ఒకే రోజు ప్రసవించారు. అందులో ఓ బిడ్డ జన్మించిన తర్వాతే మరణించింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో.. ఒకరి శిశువును మరొకరికి అప్పగించారు. దీంతో తన పాప చనిపోలేదని, ప్రాణంతో ఉన్న పాపే తన బిడ్డ అని ఓ తల్లి న్యాయపోరాటం చేసింది. మూడేళ్ల తర్వాత ఏం జరిగిందంటే?

Babies switched at birth
ఒకరి శిశువు మరొకరికి

Babies switched at birth: ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ తల్లి తన బిడ్డకు మూడేళ్లు దూరమైంది. తనకు ప్రాణం లేని శిశువును అప్పగిస్తే.. న్యాయపోరాటం చేసింది. చివరకు డీఎన్​ఏ పరీక్షలు, పోలీసుల దర్యాప్తు తర్వాత.. కోర్టు ఆదేశాలతో మూడేళ్లకు తన శిశువును తాను దక్కించుకుంది. ఈ సంఘటన అసోంలోని బార్​పేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది: బార్​పేట్​కు చెందిన నజ్మా ఖనమ్​ అనే మహిళ 2019, మే 3వ తేదీన నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమెను ఐసీయూకు తరలించారు. శిశువును చిన్నారుల సంరక్షణ గదిలో ఉంచారు. కొద్ది గంటల తర్వాత నజ్మా ఖనమ్​ కుటుంబ సభ్యులకు మృత శిశువును తీసుకొచ్చి అప్పగించారు ఆసుపత్రి సిబ్బంది. ఆరోగ్యంగా ఉన్న బిడ్డకు జన్మనిచ్చిందని, చనిపోయే అవకాశమే లేదని వారు చెప్పారని నజ్మా ఖనమ్​ న్యాయవాది అబ్దుల్​ మన్నన్​ తెలిపారు.

"మూడు రోజుల తర్వాత.. ఆసుపత్రిలో ఆ రోజు ఎవరెవరు ప్రసవం అయ్యారని నజ్మా ఖనమ్​ కుటుంబ సభ్యులు వివరాలు సేకరించారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు దాదాపు ఒకే పేరుతో నజ్మా ఖనమ్​, నజ్మా ఖాతున్​లు.. బిడ్డకు జన్మనిచ్చినట్లు గుర్తించారు. అందులో ఒక శిశువు జన్మించిన వెంటనే మరణించింది. ఈ విషయంపై నజ్మా ఖనమ్​ కుటుంబ సభ్యులు బార్​పేట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్​ 120బీ, 363 ప్రకారం పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డీఎన్​ఏ పరీక్షలకు అనుమతించాలని బార్​పేట్​ జిల్లా కోర్టులో 2020, అక్టోబర్​ 8న దర్యాప్తు అధికారి పిటిషన్​ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు బిడ్డను తన తల్లికి అప్పగించారు."

- అబ్దుల్​ మన్నన్​, న్యాయవాది

ఇద్దరు మహిళలు దాదాపు ఒకే పేరుతో ఉండటం, ఒకే రోజు బిడ్డలకు జన్మనివ్వటం వల్లే పొరపాటు జరిగినట్లు తమ దర్యాప్తులో తేల్చారు పోలీసులు. చనిపోయిన శిశువుకు బదులుగా.. మరో బిడ్డను గొస్సాయ్​గావ్​కు చెందిన నజ్మ ఖాతున్​కు అప్పగించినట్లు తేల్చారు. దీంతో బిడ్డను సొంత తల్లికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి: పెళ్లికి నో చెప్పిందని 'వివాహిత'పై యాసిడ్​ దాడి

పెళ్లిలో లక్కీ డ్రా.. గెస్ట్​ను వరించిన అదృష్టం.. గిఫ్ట్​ ఏంటంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.