ఎక్కడైనా కోడి గుడ్లను కృత్రిమంగా పొదిగించడం చూశాం. ఇంకేవైనా గుడ్లు పొదిగించడం చూశాం. కర్ణాటక, మంగళూరుకు చెందిన పాముల సంరక్షులు కిరణ్, అజయ్ మాత్రం ఏకంగా కొండ చిలువ గుడ్లనే పొదిగించారు. అవి పిల్లలుగా మారాక అటవీ శాఖ అధికారుల సహాయంతో అడవిలో వదిలిపెట్టారు. కిరణ్, అజయ్ చేసిన పనికి అటవీ సిబ్బందితో సహా, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే: దొంగకేరి సమీపంలోని వెంకటరమణ ఆలయానికి ఎదురుగా భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ పాము గుడ్లు కనిపించాయి. దీంతో ఇంటి యజమాని షమిత్ సువర్ణ మంచి మనసుతో పాము సంరక్షకులు అజయ్కు గుడ్లు కనిపించిన విషయం తెలియజేసింది. ఈ విషయాన్ని అజయ్.. కిరణ్కు తెలపగా ఇంక్యుబేషన్ విధానంలో గుడ్లు పొదిగే ఏర్పాటు చేశారు.