కృష్ణుడి విగ్రహం మింగేసిన భక్తుడు.. డాక్టర్ల శ్రమతో లక్కీగా..

author img

By

Published : Jun 24, 2022, 12:58 PM IST

Doctors removed a Krishna idol

కర్ణాటకలో నివసించే ఓ 45 ఏళ్ల వ్యక్తి రోజూ తన ఆరాధ్య దైవం బాలకృష్ణుడ్ని పూజించేవాడు. అయితే ఓ రోజు నైవేద్యంగా ఉంచిన పంచామృతాన్ని తీర్థంగా తీసుకున్నాడు. కానీ తీర్థంతో పాటు విగ్రహాన్ని కూడా మింగేశాడు. డాక్టర్లు తీవ్రంగా శ్రమించి అతడి గొంతు నుంచి విగ్రహాన్ని బయటకు తీశారు.

మనం దేవుడ్ని భక్తిశ్రద్దలతో పూజ చేయడంలో తప్పు లేదు. కానీ ఆ ధ్యాసలో పడి ప్రపంచాన్నే మర్చిపోకూడదు. అలా చేసిన ఓ భక్తుడు.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.. పూజ ధ్యాసలో మునిగిపోయి తీర్థంతోపాటు బాలకృష్ణుడి విగ్రహాన్ని మింగేశాడు. ఆ వ్యక్తి గొంతులో ఇరుక్కున్న విగ్రహాన్ని డాక్టర్లు ఎంతో కష్టపడి ఆపరేషన్ చేసి బయటకు తీశారు.

ఇదీ జరిగింది.. బెళగావికి చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తి రోజూ తన ఆరాధ్య దైవం బాలకృష్ణుడ్ని పూజించేవాడు. అయితే.. ఓరోజు అనుకోకుండా తీర్థం తీసుకునేటప్పుడు పంచామృతంలో ఉన్న బాలకృష్ణుడి విగ్రహాన్ని మింగేశాడు. దాని గురించి అతడికి కూడా తెలియదు. గొంతులో విపరీతమైన నొప్పి, వాపు రావడం వల్ల అనుమానం వచ్చి స్థానిక వైద్యుల వద్దకు వెళ్లాడు. ఎక్స్‌రే చేసి చూడగా గొంతులో కృష్ణుడి విగ్రహం ఇరుక్కుపోయిందని తేల్చారు వైద్యులు.

Doctors removed a Krishna idol
ఎక్స్​రే
Doctors removed a Krishna idol
బయటకు తీసిన బాలకృష్ణుడి విగ్రహం
బెళగావిలోని కేఎల్​ఈఎస్​ ఆస్పత్రికి అతడ్ని రిఫర్ చేశారు. ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు.. ఆహార నాళికలో ఎడమవైపు కృష్ణుడి విగ్రహం ఇరుక్కుపోయిందని నిర్ధరించారు. ఆ తర్వాత శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించాలని నిర్ణయించారు. ఈఎన్​టీ విభాగానికి చెందిన డాక్టర్లు ప్రీతి హజారే, వినీత, చైతన్య కామత్‌తో కూడిన బృందం ఆపరేషన్​ చేసి కృష్ణుడి ప్రతిమను తొలగించారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినందుకు వైద్యుల్ని అందరూ ప్రశంసించారు.

ఇవీ చదవండి: అనుమానాస్పదంగా జింకల కళేబరాలు.. సోలార్​ కంపెనీ పనేనా?

Gujarat riots 2002: మోదీకి క్లీన్​ చిట్​ను సమర్థించిన సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.