తెలంగాణ

telangana

కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల్లో ఐదుగురు!

By

Published : Jan 26, 2022, 7:21 PM IST

Building collapse Mumbai: ముంబయిలోని బంద్రా ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

building collapse in Behram Nagar
కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

Building collapse Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని బంద్రాలో ఘోర ప్రమాదం జరిగింది. బెహ్రామ్​ నగర్​ ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఐదుగురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు బృహన్​ ముంబయి కార్పొరేషన్​ అధికారులు. ఇప్పటి వరకు ఆరుగురుని కాపాడి.. ఆసుపత్రికి తరలించారు.

భవనం కూలిన ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే.. సంఘటనా స్థలానికి ఐదు అగ్నిమాపక యంత్రాలు, ఒక రెస్క్యూ వ్యాన్​ వచ్చాయి. సహాయక చర్యలు చేపట్టారు సిబ్బంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు... ఆరు అంబులెన్సులను సంఘటనాస్థలానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details