ETV Bharat / bharat

మద్యం తాగి పెళ్లికి వెళ్లిన ఆరుగురు మృతి- ఏమైంది?

author img

By

Published : Jan 26, 2022, 3:32 PM IST

Updated : Jan 26, 2022, 4:25 PM IST

Illicit Alcohol deaths
Illicit Alcohol deaths

Illicit Alcohol deaths: ఉత్తర్​ప్రదేశ్​లో కల్తీమద్యం కలకలం రేపింది. రాయ్​బరేలీ జిల్లాలో ఆరుగురు మృతి చెందారు. ఇంకొందరి పరిస్థితి విషమంగా ఉంది. వారంతా ఓ దుకాణంలో పూటుగా మద్యం సేవించి.. ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం అస్వస్థతకు గురయ్యారు.

Illicit Alcohol deaths: ఉత్తర్​ప్రదేశ్​ రాయ్​బరేలీ జిల్లాలోని మహరాజ్​గంజ్​ కొత్వాలి పరిధిలో విషాదం ఘటన జరిగింది. కల్తీ మద్యం తాగి ఆరుగురు మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పహాడ్​పుర్​ గ్రామంలో జరిగింది.

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్​ వైభవ్ శ్రీవాస్తవ.. పోలీసులు, స్థానిక పాలనాయంత్రాంగంతో పాటు పహాడ్​పుర్​ గ్రామానికి చేరుకుని.. విచారణ చేపట్టారు.

"బాధితులందరూ పహాడ్​పుర్​ గ్రామానికి చెందినవారే. సమీపంలోని ఓ దుకాణంలో మద్యం సేవించి.. ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అర్థరాత్రి సమయంలో ఒకరి తర్వాత మరొకరు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆరుగురు మరణించారు. మిగిలినవారికి చికిత్స అందిస్తున్నారు. కల్తీ మద్యం తాగడం వల్లే వారు మరణించినట్లు తెలుస్తోంది" అని వైభవ్ శ్రీవాస్తవ తెలిపారు.

మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: ఆర్​ఆర్​బీ పరీక్షలో 'అక్రమాల'పై ఆగ్రహం- రైలు తగలబెట్టిన అభ్యర్థులు!

Last Updated :Jan 26, 2022, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.