తెలంగాణ

telangana

సైబర్​ నేరాల్లో ఇదో కొత్తరకం - ఫేక్​ లీగల్​ నోటీసులతో సొమ్ము కాజేస్తున్న గ్యాంగ్​ అరెస్ట్​

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 4:08 PM IST

Hyderabad Police Arrested Gujarat Cyber Criminals : దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త మోసంతో అమాయక ప్రజల సొమ్మును లూటీచేస్తూ సైబర్​ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. తాజాగా అటువంటి ఘటనే హైదరాబాద్​లోనూ చోటుచేసుకుంది. డేటా ఎంట్రీ జాబ్‌ పేరిట వల వేసి, తర్వాత కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారని బాధితులను బెదిరించి డబ్బు గుంజుతున్న సైబర్ నేరగాళ్లను సైబరాబాద్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ​దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో వీరి బాధితులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Cyber Crimes in Hyderabad
Hyderabad Police Arrested Gujarat Cyber Criminals

Hyderabad Police Arrested Gujarat Cyber Criminals :హైదరాబాద్​ పరిధిలో నిత్యం సైబర్​ నేరాలు, సైబర్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రోజుకో కొత్త పంథాలో సైబర్​ నేరగాళ్లు సైబర్ మోసాలకు తెరలేపుతున్నారు. జాబ్​ల​ పేరిటఅమాయక ప్రజలను బురిడీ కొట్టించి, పెద్ద మొత్తంలో సొమ్మును కాజేస్తున్నారు. తాజాగా అటువంటి కేసునే సైబరాబాద్​ పోలీసులు ఛేదించారు. డేటా ఎంట్రీ జాబ్‌(Data Entry Job) పేరిట వల వేసి, తర్వాత కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారని, బాధితులను బెదిరిస్తూ డబ్బు గుంజుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

సైబర్ నేరగాళ్ల నయామోసం - లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలు

సైబర్‌బాద్‌ సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్‌ చేసి, కోర్టు ముందు హాజరు పరిచినట్లు వెల్లడించారు. ఫ్లోరా సొల్యూషన్స్‌ పేరిట డేటా ఎంట్రీ జాబ్‌ ఉందని పార్ట్‌టైం ఉద్యోగం(Part Time Job) కోసం చూస్తున్న వారికి వల వేస్తున్నారు. తర్వాత బాధితులకు లాగిన్ ఐడీ పంపంచి, పని చేయమని సూచిస్తున్నారు. నమ్మిన బాధితులు పని పూర్తిచేయగానే కంపెనీ నిబంధనల పరిధిలో పని చేయడం లేదని, నిబంధనలు ఉల్లఘించారని ఫేక్‌ లీగల్‌ నోటీసులు జారీ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు దండుకుంటున్నారు.

అలా ఫేక్‌ నోటీసులకు భయపడి ఓ ఫిర్యాదుదారు రూ.6,17,600 చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్‌కు చెందిన ఆ నలుగురు నిందుతులు రాహుల్ అశోక్‌ భాయ్‌ భవిస్కర్, సాగర్ పాటిల్, కల్పేశ్ త్రాట్, నీలేశ్ పాటిల్‌లను సూరత్‌లోనే సైబరాబాద్‌ సైబర్ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఏ1గా ఉన్న వ్యక్తి గతంలో టెలీకాలర్​గా(Tele caller) పనిచేశాడని తన మిత్రులతో కలిసి ఇలా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు.

వారి ముచ్చట్లు విన్నారా - మీ ఖాతా ఖాళీ అయినట్లే

వారినుంచి 6 చరవాణులు, ఒక ల్యాప్‌టాప్‌తో పాటు 5 డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై మొత్తంగా 358 కేసులు ఉండగా, తెలంగాణలో 28 కేసులు ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో వీరి బాధితులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Cyber Crime Police on Online Scam :రాష్ట్ర రాజధానిలో పెరుగుతున్న సైబర్​ నేరాలను కట్టడి చేసేలా, ప్రస్తుతం నగర సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది సంఖ్య పెంచబోతున్నారు. కేసు నమోదవగానే నేరస్థులు కాజేసిన నగదును జమచేసిన బ్యాంకు ఖాతాలను(Bank Accounts) గుర్తించేలా కొత్త సాంకేతికతను సాయంతో వాటిని నిలువరించేలా చర్యలు తీసుకోనున్నారు.

ఎన్ని ఖాతాల ద్వారా నగదు మళ్లిస్తున్నారనే వివరాలను త్వరితగతిన సేకరిస్తారు. సాంకేతిక పరిజ్ఞానంతో చివరకు సొమ్ము ఎవరి వద్దకు చేరుతుందనేది పక్కా ఆధారాలు రాబడతారు. ఇప్పటి వరకూ తప్పించుకు తిరుగుతున్న కీలక సూత్రదారులను గుర్తించటం, వారి ఆర్థిక లావాదేవీలను నిలువరించటమే దీని ముఖ్యోద్దేశమని నగర సీపీఎస్​ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ వివరించారు.

సైబర్‌ మోసానికి గురయ్యారా? సింపుల్​గా కంప్లైంట్​ చేయండిలా!

e-Challan Frauds in Hyderabad : ఈ-చలానా మెసేజ్‌ మీకూ వచ్చిందా.. అయితే బీ కేర్​ఫుల్

ABOUT THE AUTHOR

...view details