తెలంగాణ

telangana

భార్యపై అనుమానం- నోట్లో కరెంట్​ వైర్​ పెట్టి హత్య చేసిన భర్త

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 8:14 PM IST

Man Killed Wife With Electrocution : అనుమానంతో భార్యకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేశాడో భర్త. అనంతరం ఘటనాస్థలి నుంచి పారిపోయాడు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు మైనర్లు.

Man Killed Wife With Electrocution
Man Killed Wife With Electrocution

Man Killed Wife With Electrocution :భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన ఓ భర్త, ఆమెను కిరాతకంగా హతమార్చాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో నోట్లో కరెంట్ వైర్ పెట్టి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని హరిద్వార్ జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హమీద్​ (60) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మంగళూరు పోలీస్​ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. అతడికి భార్య ఖాతూన్(52), కుమారుడు మహ్మద్ నదీమ్, కుమార్తె ఉన్నారు. అయితే తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని హమీద్​ అనుమానించేవాడు. దీంతో భార్యతో తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆమెను అంతం చేయాలని ప్లాన్ వేశాడు. అనుకున్నట్లే శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో కరెంట్​ వైర్​ను నిద్రిస్తున్న భార్య నోట్లో పెట్టాడు. దీంతో ఆమె విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత నిందితుడు ఘటనాస్థలి నుంచి పారిపోయాడు. అనంతరం మృతురాలి కుమారుడు నదీమ్​, తన తండ్రే, తన తల్లికి కరెంట్ షాక్​ ఇచ్చి చంపేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు హరిద్వార్ ఎస్​పీ ప్రమేంద్ర ఢోబాల్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇన్​ఫార్మర్ సమాచారంతో నిందితుడిని లంధోరా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతోపాటు కరెంట్​ షాక్​ ఇచ్చేందుకు వాడిన పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఐదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
ఐదేళ్ల బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు మైనర్లు. బాలికపై ఆమె చదివే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. నిందితుల వయసు 8, 10 ఏళ్లు అని సమాచారం. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గోండా జిల్లాలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఇంటికి చేరుకున్న బాలిక తన మర్మాంగాల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని కుటుంబీకులకు తెలిసింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం మహిళా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను ఎస్​పీ వినీత్ జైస్వాల్ ధ్రువీకరించారు.

ఇన్సూరెన్స్​లో నామినీగా చేర్చలేదని SDM హత్య- కట్టుకథతో బయటపడేందుకు భర్త యత్నం

ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య - ఆపై కిడ్నాప్ డ్రామా

ABOUT THE AUTHOR

...view details