గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్ అయి చెల్లాచెదురైన 53కోచ్​లు

By

Published : Oct 26, 2022, 11:26 AM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

thumbnail

బిహార్​లోని గయా ప్రాంతంలో ఓ గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. ఈ రోజు ఉదయం గయాలోని హజారీబాగ్ నుంచి దాద్​రీకి బొగ్గుతో వెళ్తున్న రైలు.. పట్టాలు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు. కానీ 58 కోచ్​లలో 53 కోచ్​లు చెల్లాచెదురయ్యాయి. రైల్వే సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని మరమ్మతులు చేస్తున్నారు. బ్రేక్​ ఫెయిల్​ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సిబ్బంది గుర్తించారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాల్సిన పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.