ETV Bharat / state

Telangana Group 1 Prelims Exam : యథాతథంగా గ్రూప్-1 ప్రిలిమ్స్.. వాయిదాకు నో చెప్పిన హైకోర్ట్

author img

By

Published : Jun 9, 2023, 12:03 PM IST

Updated : Jun 9, 2023, 1:16 PM IST

Group 1 Prelims Exam 2023
Group 1 Prelims Exam 2023

12:00 June 09

ఎల్లుండి జరగనున్న గ్రూప్1 ప్రిలిమ్స్.. పరీక్షలో జోక్యానికి ధర్మాసనం నిరాకరణ

Group 1 Prelims Exam 2023 : ఈ నెల 11న జరగనున్న గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఎల్లుండి జరగనున్న పరీక్షను వాయిదా వేయడానికి ధర్మాసనం నిరాకరించింది. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీకి సంబంధించి దర్యాప్తు పూర్తయ్యేదాకా ప్రిలిమ్స్​ను వాయిదా వేయాలని కోరుతూ ఇటీవల పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్​లు దాఖలు చేశారు. లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని.. దాంతో ఆ సంస్థ విశ్వసనీయతపై సందేహాలున్నాయని ధర్మాసనానికి వారు వివరించారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను యూపీఎస్సీకి అప్పగించాలని పిటిషన్‌లో కోరారు.

TS HC on Group1 Prelims Exam : ఓవైపు ఈ కేసులో ఇంకా సిట్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులందరూ ఇంకా బయటపడలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. రోజురోజుకూ కొత్త కొత్త నిందితులు తెరపైకి వస్తున్నారని.. అయినా పరీక్ష నిర్వహించడానికి కమిషన్ సిద్ధపడిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షలపై 5 లక్షల మంది ఆశావహులు ఉన్నారని.. పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ కమిషన్​కు వినతి పత్రం సమర్పించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వెల్లడించారు.

TSPSC Paper Leak Case Updates : లీకేజీ వ్యవహారంలో కేవలం కమిషన్​కు చెందిన ఇద్దరు శాశ్వత, ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్ రావు వాదనలు వినిపించారు. దీనికి బాధ్యులైన వారిని సస్పెండ్ చేయడంతో పాటు అసిస్టెంట్ కంట్రోలర్‌, పరీక్షల రహస్య విభాగాల పర్యవేక్షణ నిమిత్తం చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని హైకోర్టుకు వివరించారు. గ్రూప్‌-1 పరీక్ష కోసం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు జరిగినట్లు చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 5కు వాయిదా వేశారు.

TSPSC Paper Leak Case: హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన టీఎస్‌పీఎస్సీ

ధర్మాసనం వద్ద సవాల్..: 5న జస్టిస్ ఎం.సుధీర్‌ కుమార్​ మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని జాగ్రత్తలతో ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు చేసినట్లు అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 995 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసినట్లు వివరించారు. కొందరి అభ్యంతరాల కోసం లక్షలాది మంది విద్యార్థులను గందరగోళానికి గురి చేయవద్దని కోరారు. ఇరు వైపులా వాదనలు విన్న జస్టిస్ ఎం.సుధీర్​కుమార్​ ప్రిలిమ్స్​ పరీక్ష వాయిదాకు నిరాకరించారు. ఈ మేరకు పిటిషన్లను కొట్టివేశారు. దీంతో సింగిల్​ జడ్జి ఉత్తర్వులను పిటిషనర్లు ధర్మాసనం వద్ద సవాల్​ చేశారు. జస్టిస్ అభినంద్ కుమార్, జస్టిస్ రాజేశ్వరరావు ధర్మాసనం నేడు విచారణ చేపట్టి అప్పీల్‌ను కొట్టివేసింది. ప్రిలిమ్స్ పరీక్షను నిలిపివేయడం పరిష్కారం కాదని వ్యాఖ్యానించింది. దీంతో ఎల్లుండి జరగనున్న గ్రూప్​ 1 ప్రిలిమ్స్ పరీక్ష యథాతథంగా జరగనుంది.

ఇవీ చూడండి..

Telangana Group-1 Prelims Exam : గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టులో పిటిషన్లు.. విచారణ 5కు వాయిదా

Telangana Group-1 Prelims Exam : గ్రూప్-1 వాయిదాకు హైకోర్టు నిరాకరణ, ఈనెల 11న ప్రిలిమ్స్

ప్రియుడితో కలిసి తల్లి హత్య.. ప్రేమ వద్దు అన్నందుకు మైనర్ కూతురు దారుణం

Last Updated :Jun 9, 2023, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.