ETV Bharat / bharat

Accused used chat GPT to cheat in TSPSC Exams : టీఎస్​పీఎస్సీ పేపర్ లీక్.. చాట్​ జీపీటీతో ఏఈఈ పరీక్ష

author img

By

Published : May 30, 2023, 9:29 AM IST

Accused used chat GPT to cheat in TSPSC Exams
Accused used chat GPT to cheat in TSPSC Exams

Accused used chat GPT to cheat in TSPSC Exams : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు విచారణలో రోజురోజుకు కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. పరీక్ష హాలులోకి ఎలక్ట్రానిక్‌ పరికాలను తీసుకెళ్లిన ఏడుగురు నిందితులకు.. విద్యుత్‌ శాఖ డీఈ రమేశ్‌.. చాట్‌ జీపీతో సమాధానాలు చెప్పినట్లు సిట్ అధికారులు తాజాగా గుర్తించారు. అందుకు ఎగ్జామినర్‌ సహకరించినట్లు తేల్చిన సిట్‌.. అతడిని గుర్తిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తోంది.

టీఎస్​పీఎస్సీ ఎగ్జామ్​లో చాట్​ జీపీటీ ని ఉపయోగించారు

Accused used chat GPT to cheat in TSPSC Exams : సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. విద్యుత్‌శాఖ డీఈ రమేశ్‌ కనుసన్నల్లో పెద్దఎత్తున ప్రశ్నపత్రాలు చేతులు మారినట్టు సిట్‌ నిర్దారించింది. ఏఈఈ, డీఏఓ పరీక్షలకు హాజరయ్యే కొందరు అభ్యరులతో ఒప్పందం కుదుర్చుకొని.. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పరీక్ష హాలులోని ఏడుగురు అభ్యరులకు సమాధానాలు చేరవేసినట్టు సిట్‌ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అందుకు ఓఎగ్జామినర్ సహకరించినట్లు దర్యాప్తులో తేలింది.

ఇప్పటి వరకు కేవలం ప్రశ్నపత్రాలు విక్రయించి మాత్రమే సొమ్ము చేసుకున్న కేసులో తొలిసారిగా నిందితులు.. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ పరికరాలను ఉపయోగించటం సంచలనంగా మారింది. విద్యుత్‌ శాఖ డీఈ రమేశ్​తో ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ద్వారా పరీక్ష రాసిన ప్రశాంత్, నరేష్, మహేశ్, శ్రీనివాస్‌ను సిట్ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆ ముఠా నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన మరో 20 మంది అభ్యరులను పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

Accused used chat GPT to cheat in AEE Exam : టీఎస్​ఎస్​పీడీసీఎల్​ జూనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్​తో పేపర్ లీకేజ్‌ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌కు పరిచయం ఉంది. ప్రవీణ్‌ తన చేతికి టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు వచ్చాక సురేశ్‌ను దళారీగా మార్చాడు. ఏఈఈ, డీఏఓ ప్రశ్నపత్రాలను సురేశ్‌ 25 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. సురేశ్‌ ద్వారా డీఈ రమేశ్‌ కొన్ని ప్రశ్నపత్రాలు తీసుకొని అమ్మినట్లు తెలుస్తోంది. ఏఈఈ, డీఏఓ ప్రశ్నపత్రాలు కావాలంటూ మరికొందరు అభ్యర్ధుల నుంచి ఒత్తిడి రావటంతో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రమేశ్‌ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సమాధానాలు చేరవేసేలా ఏడుగురు అభ్యరుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.20-రూ.30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Warangal DE Ramesh Helped to cheat in AEE Exam : వారి నుంచి డబ్బు తీసుకున్న తర్వాత డీఈ రమేశ్ ఆ అభ్యర్థులకు ముందుగా మైక్రోఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు సమకూర్చాడు. అభ్యర్థులు వాటిని బెల్టులో భద్రపర్చుకొని పరీక్ష హాలులోకి చేరారు. అక్కడి ఎగ్జామినర్‌ సహాయంతో అభ్యర్థులు ప్రశ్నపత్రాల ఫొటోలు తీసుకున్నారు. వాటిని పరీక్ష ప్రారంభమయ్యే 10 నిమిషాల ముందు రమేశ్‌ వాట్సాప్‌ నెంబర్‌కి చేరవేశారు. చాట్‌జీపీటీ ద్వారా రమేశ్‌.. వాటికి అనువైన సమాధానాలు సేకరించి వాట్సాప్‌ ఫోన్‌కాల్‌ ద్వారా పరీక్ష హాలులోని ఏడుగురు అభ్యరులకు చేరవేశాడు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో.. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన ఎగ్జామినర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ కేసులో అరెస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

SIT Investigation in TSPSC Paper Leakage Case : రాత పరీక్షలు పూర్తైన మూడు ఉద్యోగ నోటిఫికేషన్ల తదుపరి ప్రక్రియలు.. ప్రశ్నాపత్రాల లీకేజీపై దర్యాప్తు తుది నివేదిక వచ్చే వరకు నిలిచిపోనున్నాయి. సిట్‌ దర్యాప్తు కొనసాగుతున్నందున ఫలితాలు వెల్లడించి.. తుది ఎంపికలు చేపట్టడం న్యాయసూత్రాలకు విరుద్ధమని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. తుది ఎంపికలు చేస్తే సాంకేతిక, న్యాయపరంగా ఇబ్బందులు తలెత్తవచ్చని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడయ్యే వరకు వేచిచూడాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.