ETV Bharat / state

TSPSC Paper Leakage Case Updates : టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు.. 44కి చేరిన అరెస్టుల సంఖ్య

author img

By

Published : May 28, 2023, 10:46 PM IST

Updated : May 28, 2023, 10:55 PM IST

TSPSC Paper Leak Case : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకేజీ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. దీంతో నిందితుల అరెస్ట్‌ సంఖ్య 44కు చేరుకుంది. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Etv Bharat
Etv Bharat

TSPSC Paper Leakage Case Updates : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్‌ అధికారులు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విప్రోలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న నర్సింగరావు.. ప్రధాన నిందితుడు ప్రవీణ్ నుంచి ఏఈఈ ప్రశ్నపత్రాన్ని సేకరించాడని అధికారులు గుర్తించారు. వీరిద్దరు స్నేహితులు అయినందున డబ్బు తీసుకోకుండానే ప్రశ్నపత్రాన్ని నర్సింగరావుకు ప్రవీణ్‌ ఇచ్చాడని తెలుసుకున్నారు. దీంతో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య 44కు చేరుకుంది.

AE Paper Leakage Case IN TS : ఏఈ సివిల్ పేపర్ భారీ ఎత్తున చేతులు మారినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. ఇటీవల కీలక నిందితుడు రవికిషోర్‌ను అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. నిందితుల చిట్టా పెరిగిపోతుంది. అతని వద్ద ప్రశ్నా పత్రం విక్రియించిన వారి వేటలో సిట్‌ పోలీసులు ఉన్నారు. ఇదే క్రమంలో వరంగల్‌కి చెందిన విద్యుత్ శాఖ డీఈ రమేష్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

TSPSC paper Leakage case : శనివారం అతనితో పాటు పోలీసులు మరో నలుగురిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల అరెస్ట్ అయిన విద్యుత్‌ శాఖ జూనియర్ అసిస్టెంట్‌ రవికిషోర్‌.. డీఈ రమేష్ కనుసన్నల్లోనే ప్రశ్నా పత్రాలు విక్రయించాడని పోలీసులు గుర్తించారు. డీఈ రమేష్‌.. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో అభ్యర్ధులకు వివిధ అంశాలపై శిక్షణనిచ్చారు. ఆ సమయంలో అక్కడి అభ్యర్ధులతో పరిచయాలను అడ్డుపెట్టుకొని దందా కొనసాగించినట్టు నగర సిట్‌ పోలీసులు గుర్తించారు.

TSPSC paper leak: దీంతో పాటు సైదాబాద్‌లో ఓకే భవన సముదాయంలో.. ఇప్పటికే అరెస్ట్ అయిన సురేష్, రవికిషోర్, దివ్య, విక్రమ్‌లు నివాసం ఉండే వారని పోలీసులు దర్యాప్తులో తేలింది. వారి నివాసానికి సమీపంలో ఉన్న ఓ చిల్లర దుకాణంలో ఉన్న జిరాక్స్‌ యంత్రం నుంచి రవికిషోర్‌.. ఏఈ ప్రశ్న పత్రాలు 15 కాపీలు ఫొటోస్టాట్‌ తీసినట్లు తేలింది. వాటిని ఒక్కొక్కరికి వారి స్తోమతను బట్టి లక్ష నుంచి మూడు లక్షల వరకు విక్రయించినట్టు సిట్‌ అధికారులు గుర్తించారు. దీంతో పాటు రవికిషోర్‌ ఖాతాలో చాలా మందికి సంబంధించిన లావాదేవీలు గుర్తించారు.

ఏఈ పరీక్షలో పలువురు టాపర్లకు సంబంధిచిన వివరాలు.. రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో ఉన్నట్లు స్టేట్‌మెంట్‌లో తేలింది. రవికిషోర్‌తో పాటు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని పలు కోచింగ్ సెంటర్ల వద్ద పేపర్ విక్రయించేందుకు అరెస్ట్ అయిన కొందరు నిందితులు తిరిగినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. కాగా ఇప్పటి వరకూ 44 మందిని నిందితులుగా తేల్చి.. అరెస్ట్ చేశారు. డీఈ నుంచి వచ్చిన సమాచారంతో మరికొంత మందిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చదవండి :

Last Updated :May 28, 2023, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.