ETV Bharat / state

పిల్లలు లేని కుమార్తె కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ - ఆరు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 5:07 PM IST

Girl Kidnapped at Old City Kishan Bagh : పిల్లలు లేని కుమార్తె కోసం ఆ తల్లి, ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన పాతబస్తీ కిషన్‌ బాగ్‌లో చోటుచేసుకుంది. బాధితులు బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆరు గంటల్లో పాపను ట్రేస్ చేసి తల్లిదండ్రులకు అప్పగించారు.

Girl Rescued by Hyderabad Police
Girl Kidnapped at Old City Kishan Bagh

Girl Kidnapped at Old City Kishan Bagh : తన కన్నబిడ్డకు పిల్లలు లేరని బాధ పడింది ఆ తల్లి. ఎలాగైనా తన కుమార్తెను తల్లిని చేయాలనుకుంది. దీనికోసం ఎక్కడ తిరిగినా సమస్యకు పరిష్కారం లభించకపోయేసరికి ఎవరినైనా ఓ చిన్నారిని అపహరించైనా సరే తన బిడ్డను అమ్మను చేయాలి అనుకుంది. తన నివాసం సమీపంలోనే పార్క్‌లో ఆడుతూ కనిపించిన ఓ చిన్నారిపై కన్నేసి అపహరించింది.

Boy Kidnap at Secunderabad Railway Station Video Viral : 5 ఏళ్ల బాలుడిని కిడ్నాప్​.. 8 గంటల్లోనే ఆచూకీ కనిపెట్టిన రైల్వే పోలీసులు

ఈ ఘటన పాతబస్తీ కిషన్‌బాగ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలు నసీం బేగంకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు పిల్లలు పుట్టడంలేదని చాలా చోట్లు తిరుగుతున్నారు. ఇంటి దగ్గర కిషన్‌బాగ్‌ పార్క్‌లో తన నానమ్మ వెంట వచ్చింది ఓ చిన్నారి. అయితే వాళ్ల నానమ్మ పార్క్‌ ప్రవేశ టికెట్ కొనే సమయంలో ఆడుకుంటున్న ఆ చిన్నారి నసీం బేగం కంట్లో పడింది. ఈ క్రమంలో ఆ చిన్నారిని కిడ్నాప్ చేసింది. తరువాత తన కుమార్తె అయేషా బేగంకు ఇచ్చింది.

Ghatkesar Girl Kidnap Case Update : ఇంటిముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. గంటల్లోనే..!

సోదరుడి కోసం పెట్రోల్​ బంకులో యువతి ఎదురుచూపులు- అందరూ చూస్తుండగానే పట్టపగలే కిడ్నాప్​!

Girl Rescued by Hyderabad Police : చిన్నారి తల్లిదండ్రులు సాయంత్రం బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫలక్‌నుమా ఏసీపీ సుధాకర్ ఆధ్వర్యంలో క్రైమ్ పోలీసులు నాలుగు టీంలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలన్నీ పరిశీలించగా తాడ్‌బండ్ ఎక్స్ రోడ్డు వద్ద ఇద్దరు మహిళల దగ్గర ఆ చిన్నారిని చూశారు. వారిని అదుపులోకి తీసుకుని బాలికను పోలీసులు రక్షించారు. కేసు చేధించిన టీంను డీసీపీ అభినందించి వారికి రివార్డులు అందజేశారు.

"ఇవాళ కిషన్‌బాగ్‌లో మూడున్నర సంవత్సరాల చిన్నపాప కిడ్నాప్‌ కేసును బహదూర్ పోలీసులు సక్సెస్‌ ఫుల్‌గా ట్రేస్ చేశారు. ఈ కిడ్నాప్ 3గంటలకు జరిగింది. 7గంటలకు రిపోర్ట్ చేస్తే 10 గంటల కల్లా పాపను కనుక్కొని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. పాప కిడ్నాప్ గురించి మాకు ఫిర్యాదు రాగానే అన్ని క్రైమ్ పోలీసులను అలర్ట్‌ చేశాము. 100 సీసీ కెమెరాలను వెతికాము. చివరకు నిందితురాలిని గుర్తించాం" - సాయి చైతన్య, కమిషనర్ ఆఫ్ పోలీస్ సౌత్ జోన్

పిల్లలు లేని కుమార్తె కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ - ఆరు గంటల్లోనే ఛేదించిన పోలీసులు

జగిత్యాలలో బాలుడి అపహరణకు యత్నం - నిందితుడికి దేహశుద్ధి

Malkajgiri Boy Kidnap Case Updates : అప్పు తీర్చేందుకు ఇద్దరు.. చదువు కోసం మరొకరు.. చివరకు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.