Boy Kidnap at Secunderabad Railway Station Video Viral : 5 ఏళ్ల బాలుడిని కిడ్నాప్​.. 8 గంటల్లోనే ఆచూకీ కనిపెట్టిన రైల్వే పోలీసులు

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 10:37 AM IST

Updated : Sep 30, 2023, 1:45 PM IST

thumbnail

Boy Kidnap at Secunderabad Railway Station Video Viral : సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో ఉదయం గుర్తు తెలియని దంపతులు అపహరణ చేసిన బాలుడి ఆచూకీ లభించింది. సీసీ కెమెరా ఆధారంగా రైల్వే పోలీసులు బాలుడిని కనిపెట్టారు. మాదాపూర్​ సైబర్​ టవర్స్​ దగ్గర బాలుడ్ని దంపతులు వదిలి వెళ్లారని పోలీసులు తెలిపారు. వెంటనే అక్కడికి వెళ్లి బాలుడిని తీసుకువచ్చి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. కేవలం 8 గంటల్లోనే పోలీసులు ఈ కిడ్నాప్ కేసును ఛేదించారు. 

అసలేం జరిగిందంటే : మెదక్​ జిల్లా కౌడిపల్లి మండలం రాయలపురం గ్రామానికి చెందిన మంగళి దుర్గేశ్ తన ఐదేళ్ల కుమారుడి (మతిస్తిమితం లేని వికలాంగుడు)ని వెంటపెట్టుకుని తిరుపతికి వెళ్లాడు. ఈ నెల 28వ తేదీన తిరిగి పయనమయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​కు చేరుకున్నాడు. రైలు దిగిన తర్వాత ఒకటో నంబర్​ ప్లాట్​ఫాంపై బ్యాగుతో పాటు తన కుమారుడిని వదిలిపెట్టి.. వాష్​రూంకు వెళ్లాడు. తిరిగొచ్చి చూసేసరికి తన కొడుకు కనిపించలేదు. స్టేషన్​ మొత్తం వెతికినా.. ఆచూకీ లభించకపోవడంతో రైల్వే పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు తక్షణమే సీసీ ఫుటేజ్​ పరిశీలించారు. అందులో బాలుడ్ని ఎవరో గుర్తు తెలియని దంపతులు తీసుకువెళ్లినట్టు కనిపించింది. ప్రస్తుతం బాలుడ్ని అపహరించిన విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Last Updated : Sep 30, 2023, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.