ETV Bharat / sitara

Amitabh Bachchan : రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన అమితాబ్‌ బచ్చన్‌

author img

By

Published : Jul 27, 2021, 11:14 AM IST

Updated : Jul 27, 2021, 12:37 PM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో మైలురాయిని చేరుకుంది. స్వయంగా బాలీవుడ్ సూపర్ స్టార్.. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఈ సవాల్​ను స్వీకరించారు. తెలంగాణ ఎంపీ సంతోశ్​ కుమార్​ ఛాలెంజ్​ను స్వీకరించిన బిగ్​ బీ.. హైదరాబాద్​ ఫిల్మ్​ సిటీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోశ్​ను ప్రశంసించారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన అమితాబ్‌ బచ్చన్‌
రామోజీ ఫిల్మ్‌సిటీలో మొక్కలు నాటిన అమితాబ్‌ బచ్చన్‌

రాజ్యసభ ఎంపీ సంతోశ్​ కుమార్​.. ఈయన పేరు ఎప్పుడు విన్నా.. అది ఎక్కువగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. హరిత సవాల్​ ద్వారానే ఉంటుంది. ఎందుకంటే.. తెలంగాణ తల్లికి పచ్చచీర కట్టాలని.. రాష్ట్రమంతా పచ్చదనంతో పరిఢవిల్లాలనే ఉద్దేశంతో సంతోశ్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఎందరో సినిమా సెలిబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులకు హరిత సవాల్ విసిరారు.

amitabh-banchan-accepted-mp-santhoshs-kumars-green-india-challenge
మొక్క నాటిన బిగ్​బీ

ఇవీ చదవండి :

సంతోశ్ ఛాలెంజ్​ను స్వీకరించిన ఎంతో మంది ప్రముఖులు.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తమ వంతు కృషి చేశారు. తాజాగా.. పద్మవిభూషణ్.. బాలీవుడ్ సూపర్ స్టార్.. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్​ సిటీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, సినీ నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు నాగ్ అశ్విన్, ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు.

amitabh-banchan-accepted-mp-santhoshs-kumars-green-india-challenge
అమితాబ్​తో ఎంపీ సంతోశ్

ఇవీ చదవండి :

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను ప్రారంభించి.. పచ్చదనానికి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్​ను అమితాబ్(Amitabh Bachchan) ప్రశంసించారు. ఈ కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలు మహావృక్షాలై ఎదిగి తర్వాతి తరానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్​ను స్వీకరించి.. మొక్కలు నాటాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోశ్.. అమితాబ్​కు వృక్షవేదం పుస్తకాన్ని అందించారు.

amitabh-banchan-accepted-mp-santhoshs-kumars-green-india-challenge
వృక్షవేదం పుస్తకాన్ని అమితాబ్​కు అందజేసిన ఎంపీ

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని హీరో నాగార్జున కోరారు. ఎంపీ సంతోష్‌ 16 కోట్ల మొక్కలు నాటించడం ప్రశంసనీయమని అభినందించారు. మొక్కలు నాటడమే కాకుండా.. వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు.

  • Presented @SrBachchan ji with #VrukshaVedam book and explained him about the contents. He’s shown very much interest in it and appreciated the efforts to bring the details to the light. Pleasure that he said he would go though the entire book leisurely and spread the word. pic.twitter.com/dgOZsHBDVG

    — Santosh Kumar J (@MPsantoshtrs) July 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి :

Last Updated :Jul 27, 2021, 12:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.