ETV Bharat / city

Modi Letter: గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వృక్షవేదం పుస్తకానికి ప్రశంసలు

author img

By

Published : May 28, 2021, 12:29 PM IST

ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వృక్షవేదం పుస్తకాన్ని ప్రశంసిస్తూ... ఎంపీకి మోదీ లేఖ రాశారు. పచ్చదనం పెంపు దిశగా యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారని అభినందించారు.

pm modi appreciation letter to mp santhosh kumar for green india challenge
pm modi appreciation letter to mp santhosh kumar for green india challenge

రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను విజయవంతంగా నిర్వహిస్తుంన్నందుకు, వృక్షవేదం పుస్తకానికి గానూ ప్రశంసలు కురిపించారు. పచ్చదనం పెంపు దిశగా యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారని ప్రధాని అభినందించారు.

ప్రకృతితో మనిషికున్న అనుబంధం తెలిపే పుస్తకం.. వృక్షవేదని మోదీ అభివర్ణించారు. వృక్షవేదం పుస్తకం అందరూ చదవి ప్రేరణ పొందాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రకృతిపరంగా గొప్ప వారసత్వాన్ని రక్షించుకునేందుకు కృషి చేయాలని మోదీ కోరారు.

pm modi appreciation letter to mp santhosh kumar for green india challenge
గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వృక్షవేదం పుస్తకానికి ప్రశంసలు

ప్రశంసా లేఖకు గానూ... ప్రధానికి ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటితే బాగుంటుందని మోదీకి సంతోష్​ విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

Birth Anniversary: మూగపడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వనే.. సురవరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.