ETV Bharat / crime

Disha case news: ‘‘అది బూటకపు ఎన్‌కౌంటర్‌.. కమిషన్ ముందు లాయర్ల వాదనలు’’

author img

By

Published : Nov 17, 2021, 12:45 PM IST

disha case news, Disha encounter case news
దిశ ఎన్​కౌంటర్ కేసు, సిర్పుర్కర్‌ కమిషన్‌

దిశ నిందితుల ఎన్​కౌంటర్ కేసులో(Disha case news) వాదనలు మొదలయ్యాయి. తొలుత మృతుల కుటుంబ సభ్యుల తరఫున న్యాయవాది కేవీ కృష్ణమాచారి తన వాదనలు వినిపించారు. ఇది బూటకపు ఎన్‌కౌంటరని, నలుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని కాల్చి చంపి... కట్టుకథలు చెబుతున్నారన్నారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో(Disha case news) మంగళవారం నుంచి వాదనలు మొదలయ్యాయి. దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులైన జొల్లు శివ, నవీన్‌, జొల్లు నవీన్‌, చెన్నకేశవులు, ఆరిఫ్‌లు చటాన్‌పల్లి వద్ద జరిగిన పోలీసు కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు నియమించిన సిర్పుర్కర్‌ కమిషన్‌కు మృతుల కుటుంబ సభ్యుల తరఫున న్యాయవాది కేవీ కృష్ణమాచారి, సామాజిక కార్యకర్త సజయ తదితరులు ఫిర్యాదుచేశారు. కమిషన్‌ ఇప్పటివరకు సంఘటనలో పాల్గొన్న పోలీసులను విచారించి వారి వాంగ్మూలం(hyderabad encounter case details) నమోదు చేసింది.

వాదనలు మొదలు

మంగళవారం వాదనలు మొదలుకాగా తొలుత కృష్ణమాచారి తన వాదనలు వినిపించారు. ఇది బూటకపు ఎన్‌కౌంటరని(hyderabad encounter case details), నలుగురు నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని కాల్చి చంపి కట్టుకథలు చెబుతున్నారన్నారు. నిందితుల్లో ముగ్గురు బాలలున్నారని, వారిని జువైనల్‌ కోర్డుకు పంపకుండా, వయసు దాచిపెట్టి మరీ మామూలు జైలుకు పంపారన్నారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు కూడా తప్పుడు రికార్డులు సమర్పించారన్నారు. మరో న్యాయవాది వసుధా నాగరాజు తన వాదనలు వినిపిస్తూ నిందితులను జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరచాల్సి ఉండగా ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారన్నారు. అక్కడ 15 రోజులు రిమాండ్‌ విధించడం కూడా నిబంధనలకు విరుద్ధమన్నారు. తప్పులు సరిదిద్దుకునేందుకే పోలీసులు ఇలా చేశారని కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం

‘దిశ’ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ (Sirpurkar Enquiry on Disha Encounter case) ఉదంతంపై అబ్దుల్‌ రవూఫ్‌ అనే ప్రత్యక్ష సాక్షి (Sirpurkar Commission Enquiry) జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ (sirpurkar commission) ఎదుట గతంలో వాంగ్మూలమిచ్చారు. కమిషన్‌ తరఫు న్యాయవాదులు పరమేశ్వర్‌, విరూపాక్ష గౌడ అడిగిన ప్రశ్నలకు రవూఫ్‌ సమాధానాలిచ్చారు. ‘దిశ’కు సంబంధించిన వస్తువులను దాచిన ప్రాంతాన్ని చూపిస్తానని నిందితుడు ఆరిఫ్‌ చెప్పడంతో పోలీసుల వెంట తానూ చటాన్‌పల్లికి వెళ్లానని చెప్పారు. వస్తువుల్ని వెతికే క్రమంలో ఆరిఫ్‌ రెండు చేతులతో మట్టి విసరడంతో 12 మంది కళ్లలో పడిందని చెప్పారు. తర్వాత నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆరిఫ్‌, చెన్నకేశవులు సీఐ, ఎస్సైల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంతమంది పోలీసులు నిందితుల్ని నిలువరించే ప్రయత్నం చేయలేదా? అని న్యాయవాదులు ప్రశ్నించారు. తన కళ్లలో మట్టి పడటంతో గమనించలేదని రవూఫ్‌ చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో మీరెంత దూరంలో ఉన్నారు.? అని అడిగితే 3-4 అడుగుల దూరంలో ఉన్నానని బదులిచ్చారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఘటనాస్థలి ఫొటోలను చూపించి ఆ ప్రాంతాన్ని గుర్తుపట్టమని అడిగారు. నిందితుల వాంగ్మూలంలో లేని విషయాలు.. మీ స్టేట్‌మెంట్‌లో ఎందుకున్నాయని ప్రశ్నించగా, దానిని ఎలా నమోదు చేసుకున్నారో తనకు తెలియదని అన్నారు.

ఇదీ చదవండి: disha encounter case: 'బుల్లెట్ గాయాలు పరిశీలించకుండా మృతదేహాలను పలకరించేందుకు వెళ్లారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.