ETV Bharat / city

Justice sirpurkar commission : 'నిందితులు మాపై కాల్పులు జరపడం వల్లే మేం ఫైరింగ్ చేశాం'

author img

By

Published : Oct 28, 2021, 10:33 AM IST

Justice sirpurkar commission
Justice sirpurkar commission

దిశ హత్యాచారం నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(Justice sirpurkar commission) విచారణను వేగవంతం చేసింది. తాజాగా సీఐ నర్సింహా రెడ్డి, గచ్చిబౌలి అదనపు ఇన్​స్పెక్టర్ లాల్​మదర్​లను ప్రశ్నించింది. నిందితులు తమపై కాల్పుల జరపడం వల్లే ఎదురుకాల్పులు జరిపినట్లు సీఐ చెప్పగా.. తుపాకీ ఎలా లోడ్ చేస్తారని కమిషన్ అడిగింది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య(Disha rape case) నిందితుల ఎన్​కౌంటర్​ కేసులో జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(Justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే మృతుల కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, ఘటన జరిగినప్పుడు సైబరాబాద్​ సీపీగా ఉన్న సజ్జనార్​లను ప్రశ్నించారు. వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.

తాజాగా ఈ కేసుకు సంబంధించి.. సీఐ నర్సింహారెడ్డి, గచ్చిబౌలి అదనపు ఇన్​స్పెక్టర్ లాల్​మదర్​ను ప్రశ్నించారు. దిశ హత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న ఆరీఫ్, చెన్నకేశవులు తుపాకులు లాక్కొని.. పోలీసులపై కాల్పులు జరపడం వల్లే ఎదురుకాల్పులు జరిపినట్లు సీఐ నర్సింహారెడ్డి సిర్పూర్కర్‌ కమిషన్‌కు తెలిపారు. తుపాకీ ఎలా లోడ్‌చేస్తారని కమిషన్ ప్రశ్నించగా సీఐ నర్సింహారెడ్డి తన వద్ద ఉన్న పిస్టల్‌ను లోడ్‌చేసి కమిషన్ సభ్యులకు చూపించారు. పోలీసుల కళ్లల్లో నిందితులు మట్టికొట్టడంతో పాటు రాళ్లు, కట్టెలు విసిరారని కమిషన్‌కు చెప్పారు.

ఆ తర్వాత గచ్చిబౌలి అదనపు ఇన్‌స్పెక్టర్‌ లాల్‌మదర్‌ను కమిషన్ సభ్యులు(Justice sirpurkar commission) ప్రశ్నించారు. నిందితులను ఉంచిన అతిథిగృహం నుంచి చటాన్​పల్లికి ఎప్పుడు వెళ్లారు, ఎంతమంది పోలీసులు వెళ్లారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. లాల్‌మదర్‌ నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ఇవాళ మరోసారి కమిషన్‌ అతణ్ని ప్రశ్నించనుంది.

'దిశ’ అత్యాచార(disha case) కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ను కమిషన్​ విచారించింది. ​ కమిషన్​ సభ్యులు అడిగి ప్రశ్నలకు సజ్జనార్ సమాధానమిచ్చారు. దిశ హత్యాచార ఘటన గురించి శంషాబాద్ డీసీపీ తనకు చెప్పాడని.. కేసును అతనే పర్యవేక్షించాడని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సిర్పుర్కర్ కమిషన్​కు వివరించారు. నిందితులను గాలించడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారని.. కేసు పురోగతి గురించి శంషాబాద్ డీసీపీ ప్రతి రోజు ఉదయం జరిగే సెట్ కాన్ఫరెన్స్​లో చెప్పాడని సజ్జనార్ కమిషన్ కు తెలిపాడు. ట్రాఫిక్ పర్యవేక్షణలో భాగంగా 2019 నవంబర్ 29న శంషాబాద్ విమానాశ్రయం వరకు వెళ్లి వస్తుంటే.. అదే రోజు నిందితులను పట్టుకున్న విషయాన్ని డీసీపీ చెప్పడంతో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు మీడియాకు తెలిపానని కమిషన్ తరఫు న్యాయవాది అడిగిన ప్రశ్నకు సజ్జనార్ సమాధానమిచ్చాడు.

దిశ’ హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ (Sirpurkar Enquiry Continues on Disha Encounter) ఉదంతంపై అబ్దుల్‌ రవూఫ్‌ అనే ప్రత్యక్ష సాక్షి (Sirpurkar Commission Enquiry Eyewitness on Disha Encounter) జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ (sirpurkar commission) ఎదుట వాంగ్మూలమిచ్చారు. ‘దిశ’కు సంబంధించిన వస్తువులను దాచిన ప్రాంతాన్ని చూపిస్తానని నిందితుడు ఆరిఫ్‌ చెప్పడంతో పోలీసుల వెంట తానూ చటాన్‌పల్లికి వెళ్లానని చెప్పారు. వస్తువుల్ని వెతికే క్రమంలో ఆరిఫ్‌ రెండు చేతులతో మట్టి విసరడంతో 12 మంది కళ్లలో పడిందని చెప్పారు. తర్వాత నిందితులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఆరిఫ్‌, చెన్నకేశవులు సీఐ, ఎస్సైల నుంచి ఆయుధాలు లాక్కునేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. అంతమంది పోలీసులు నిందితుల్ని నిలువరించే ప్రయత్నం చేయలేదా? అని న్యాయవాదులు ప్రశ్నించారు. తన కళ్లలో మట్టి పడటంతో గమనించలేదని రవూఫ్‌ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.