ETV Bharat / crime

justice sirpurkar commission: దిశ కేసులో ప్రశ్నల వర్షం.. 29న విచారణకు సజ్జనార్!

author img

By

Published : Sep 27, 2021, 1:14 PM IST

Updated : Sep 27, 2021, 3:28 PM IST

justice sirpurkar commission, disha rape and murder case
సిర్పూర్కర్ కమిషన్ విచారణ, దిశ హత్యాచార కేసు విచారణ

దిశ హత్యాచార కేసు(disha rape and murder case) నిందితుల ఎన్​కౌంటర్​పై జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్(justice sirpurkar commission) విచారణ వేగవంతం చేసింది. ఎన్​కౌంటర్​ జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్​ను(disha encounter sajjanar)​ ఈ నెల 29న ప్రశ్నించనుంది. ఈ కేసులో భాగంగా పలువురు సాక్షులను కమిషన్ ప్రశ్నిస్తోంది.

దిశ హత్యాచార కేసులో(disha rape and murder case)జస్టిస్ సిర్పుర్కర్‌ కమిషన్(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. పలువురు సాక్షులను కమిషన్(disha case details in telugu) ప్రశ్నిస్తోంది. ఇప్పటికే సిట్ ఛైర్మన్ మహేష్ భగవత్‌ను ప్రశ్నించిన కమిషన్.. మరోసారి ఆయనను విచారించింది. నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంది. ఎన్‌కౌంటర్(hyderabad disha encounter case) జరిగిన సమయంలో సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్​ను(disha encounter sajjanar) ఈ నెల 29న విచారించనుంది. ఇందులో భాగంగా దర్యాప్తు అధికారి సురేందర్‌రెడ్డిని కమిషన్ ప్రశ్నించింది. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించిన కమిషన్... ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై ఆరా తీసింది.

అపూర్వారావును ప్రశ్నించిన కమిషన్

‘దిశ’ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనలో పాల్గొన్న పోలీసులు వినియోగించిన తూటాల లెక్క తేల్చేందుకు సంబంధిత ఠాణాల్లోని ఆయుధాల రిజిస్టర్‌ను తనిఖీ చేశారా? అని వనపర్తి ఎస్పీ అపూర్వారావును సిర్పుర్కర్‌ కమిషన్‌ ఇదివరకే ప్రశ్నించింది. తనిఖీ చేయలేదని ఆమె బదులిచ్చారు. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ ఘటనపై ఏర్పాటైన సిట్‌కు సంబంధించి కేస్‌ డైరీ రాసిన అపూర్వారావును కమిషన్‌ ఇప్పటికే విచారించింది.

ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై ఆరా

ఎన్‌కౌంటర్‌లో(disha encounter case) గాయపడినట్లుగా చెబుతున్న పోలీసులకు చికిత్స చేసిన ఆసుపత్రిని సందర్శించిన సమయంలో క్షతగాత్రులు ఐసీయూలో ఉన్నారా? సాధారణ వార్డులో ఉన్నారా అని ప్రశ్నించగా.. సాధారణ వార్డులోనే ఉన్నారని ఆమె బదులిచ్చారు. తీవ్రమైన గాయాలతో ఉన్నారని సిట్‌ నివేదికలో ఉందని.. అలాంటి వారిని సాధారణ వార్డులో ఎలా ఉంచారని కమిషన్‌ సభ్యులు ప్రశ్నించారు. ఐసీయూ, ఐసీసీయూ, సాధారణ వార్డులకు తేడా తెలుసా అని అసహనం వ్యక్తం చేశారు.

ఎలా నిర్ధారించారు..

అనంతరం శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని కమిషన్‌ ప్రశ్నించింది. ‘దిశ’ అత్యాచారానికి గురైందని మీరు ఎలా నిర్ధారణకు వచ్చారు అని అడిగింది. ఘటనాస్థలిలో ‘దిశ’ చున్నీ, లాకెట్‌, దుస్తులు పడి ఉండటంతోపాటు నిందితులు పురుషులు కావడంతో అత్యాచారం జరిగిందని ఊహించామన్నారు. ఆ వస్తువులు దొరికినంత మాత్రాన అత్యాచారం జరిగినట్లు ఎలా భావిస్తారని కమిషన్‌ ప్రశ్నించగా.. మౌనంగా ఉండిపోయారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత మెజిస్ట్రేట్‌ వచ్చేవరకు ఘటనాస్థలి నుంచి మృతదేహాల్ని తరలించొద్దనే విషయం మీకు తెలియదా? అని అడగ్గా.. అలా చేయడం సరికాదని అంగీకరించారు.

కోర్టును ఆశ్రయించిన కుటుంబసభ్యులు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటనలో నిందితులను పోలీసులు ఎన్​కౌంటర్​ చేసిన విషయం విదితమే. అయితే తమ వాళ్లు పారిపోయేందుకు ప్రయత్నించలేదని... పోలీసులే కావాలని ఎన్​కౌంటర్​ చేసినట్లు మృతుల కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. దీనిలో భాగంగా సిర్పూర్కర్ కమిషన్ (Sirpurkar Commission) విచారణను వేగవంతం చేసింది. కమిషన్ ముందు మృతుడు చెన్నకేశవులు భార్య హాజరయ్యారు. చెన్నకేశవులు సరిగా నడవలేడని... అలాంటి వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకుని ఎలా పారిపోగలడని... వాంగ్మూలం ఇచ్చింది. తనకు తగిన న్యాయం చేయాలని కమిషన్​ను కోరింది. దిశ ఎన్​కౌంటర్​లో మృతి చెందిన చెన్నకేశవులు భార్య రేణుకతో పాటు... చెన్నకేశవులు చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కూడా కమిషన్ గతంలో ప్రశ్నించింది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 27, 2021, 3:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.