ETV Bharat / bharat

అసెంబ్లీ పోరు.. యూపీలో రాజకీయ పార్టీల ప్రచార జోరు

author img

By

Published : Feb 5, 2022, 6:23 PM IST

UP Poll Campaign: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఉత్తర్​ప్రదేశ్​లో కీలక నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. బల్​దేవ్​ నియోజకవర్గంలో బహిరంగ సమావేశం నిర్వహించారు.

UP Poll Campaign:
UP Poll Campaign:

UP Poll Campaign: మరికొద్దిరోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా అందరిదృష్టి ఉత్తర్​ప్రదేశ్​పైనే నెలకొంది. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల కీలక నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Priyanka Gandhi door-to-door campaign: కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా శనివారం.. ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్​కు ఓటేయాలని అలీగఢ్​ ఖైర్​ నియోజకవర్గంలోని ఓటర్లను ఆమె అభ్యర్థించారు.

: Priyanka Gandhi Vadra campaign
ప్రచారంలో భాగంగా అభివాదం చేస్తున్న ప్రియాంకా గాంధీ వాద్రా
: Priyanka Gandhi Vadra campaign
ఖైర్​ నియోజకవర్గంలో ప్రియాంకా వాద్రా ప్రచారం

స్థానికులకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

యోగీ ప్రచారం..

గోరఖ్​పుర్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ కూడా ఇంటింటి ప్రచారం ప్రారంభించారు.

భాజపాతోనే అభివృద్ధి సాధ్యం..

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.. ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల ప్రచారం షురూ చేశారు. బల్​దేవ్​, ఖేరాగఢ్​, ఆగ్రా రూరల్​ స్థానాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించారు.

rajnath singh campaign
బల్​దేవ్​ నియోజకవర్గంలో రాజ్​నాథ్​ సింగ్​ బహిరంగ సమావేశం

ఈ సందర్భంగా.. రాష్ట్రంలో అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని అన్నారు. సమాజ్​వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. రాజకీయాలు ప్రభుత్వ ఏర్పాటు కోసం కాకుండా.. అభివృద్ధి, సంక్షేమం చేయాలని అన్నారు.

rajnath
రాజ్​నాథ్​ సింగ్​ను సన్మానిస్తున్న స్థానిక నేతలు

''సమాజ్​వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోంది. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాదు. కులమతాల ఆధారంగా రాజకీయాలు చేయకూడదు. సమాజ్​వాదీ పార్టీ ఇలాంటి నీచ రాజకీయాలే చేస్తోంది.''

- రాజ్​నాథ్​ సింగ్​, రక్షణ మంత్రి

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపైనా.. రాజ్​నాథ్​ విమర్శలు గుప్పించారు. ఆయన చదివిన ప్రతి దాన్నీ నమ్ముతారని, చైనా విషయంలోనూ అలాగే పొరబడ్డారని అన్నారు. భారత సరిహద్దులు సురక్షితంగానే ఉన్నాయని ఉద్ఘాటించారు.

400 స్థానాలు మావే..

Akhilesh Yadav Campaign: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల ముందు అలీగఢ్​లో మాట్లాడిన సమాజ్​వాదీ అధినేత అఖిలేశ్​ యాదవ్​.. కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ భాజపా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. ఎన్నికల్లో దానిని నిరూపిస్తారని అన్నారు.

AKHILESH YADAV
సమాజ్​వాదీ అధినేత అఖిలేశ్​ యాదవ్​
  • మొత్తం 403 స్థానాలకుగానూ.. ఎస్​పీ- ఆర్​ఎల్​డీ కూటమే 400 చోట్ల నెగ్గుతుందని జోస్యం చెప్పారు. మిగతా అన్నింటికీ కలిపి 3 స్థానాలే దక్కుతాయని పేర్కొన్నారు.
  • రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఇది యోగి ప్రభుత్వం వైఫల్యమేనని విమర్శించారు. హైదరాబాద్​ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీపై కాల్పుల ఘటనే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు.

UP Poll 2022: ఉత్తర్​ప్రదేశ్​లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్​ జరగనుంది. ఫిబ్రవరి 10న తొలి దశ ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

చివరగా 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయం సాధించింది. ఏకంగా 312 చోట్ల నెగ్గి.. సంపూర్ణ మెజరిటీ సొంతం చేసుకుంది. సమాజ్​వాదీ పార్టీ 47 చోట్ల గెలుపొందింది. బీఎస్​పీ 19, కాంగ్రెస్​ 7 స్థానాలకు పరిమితమయ్యాయి.

ఇవీ చూడండి: UP Election 2022: భాజపాకు సై.. యోగికి నై!

యూపీ సీఎం యోగి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?

Amritsar East: సిద్ధూ పంజా విసురుతారా? మజీఠియా షాక్ ఇస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.