వివాహ వేడుకలో భారీ చోరీ - 29 తులాల బంగారం అపహరణ

By ETV Bharat Telangana Team

Published : Mar 13, 2024, 4:36 PM IST

thumbnail

Robbery at Marriage Event in Gadwal : జోగులాంబ గద్వాల్​ జిల్లా కేంద్రంలోని ఎస్.వి. ఈవెంట్​ హాల్​లో జరిగిన వివాహ వేడుకలో భారీ చోరీ జరిగింది. వివాహ వేడుకల అనంతరం వధూవరులు, వారి కుటుంబసభ్యులు, బంధువులు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 29 తులాల బంగారం అపహరించినట్లు బాధితుడు కృష్ణ వర్ధన్​రెడ్డి తెలిపారు. ఈ నెల 12న రాత్రి ఈవెంట్ హాల్లో ఫంక్షన్ ముగిశాక ఆభరణాలు ఓ గదిలో తీసి పెట్టి పడుకున్నారు. ఉదయం లేచి చూసే సరికి బంగారం కనపడకపోవడంతో దొంగతనం జరిగినట్టు బాధితులు గుర్తించారు.

దీంతో బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్​ టీం ద్వారా విచారణ చేపట్టారు. కాగా ఫంక్షన్​ హాల్​ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సీసీటీవీ కెమెరా ఫుటేజీలో పోలీసులు పరిశీలించారు. దొంగతనం తెలిసిన వ్యక్తులు చేశారా లేదా బయట వ్యక్తులు చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.