LIVE : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - Kishan Reddy Press Meeting Live
Published : May 13, 2024, 7:19 PM IST
|Updated : May 13, 2024, 7:46 PM IST
Kishan Reddy Press Meeting Live From Telangana BJP State Office : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలో సాయంత్రం ఐదు గంటల వరకు 61.16 ఓటింగ్ శాతం నమోదు అయింది. ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతున్నారు. ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారని తెలుపుతున్నారు. ఎన్నికల సంఘం ప్రశాంతంగా ఎన్నికలను జరిపిందని చెబుతున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన ఎన్నికల సిబ్బంది వెంటనే వాటిని పరిష్కరించాయని తెలిపారు. తమ పార్టీ గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెమట్లో జరిగిన ఉపఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు అయిందని తెలుపుతున్నారు. మరిన్ని విషయాలను వెల్లడిస్తున్నారు. వచ్చే నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తాయని వివరిస్తున్నారు.