LIVE : హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియా సమావేశం - KISHAN REDDY LIVE IN HYDERABAD

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 12:18 PM IST

Updated : May 22, 2024, 12:46 PM IST

thumbnail

Kishan Reddy Live : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేకపోతోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఒక మాట చెప్పి ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. అప్పుడేమో అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని, ఇప్పుడు ఆగస్టులో చేస్తామంటున్నారని ధ్వజమెత్తారు. సన్నవడ్లకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విరుచుకుపడ్డారు. 'రాష్ట్రంలో 80 శాతం దొడ్లు వడ్లనే పండిస్తారు. చాలా తక్కువమంది రైతులే సన్నవడ్లు పండిస్తారు. దొడ్డు వడ్లను కొనేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? అని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Last Updated : May 22, 2024, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.