బెంగళూరులో పేలుడు - అప్రమత్తమైన హైదరాబాద్​ పోలీసులు

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 10:47 PM IST

thumbnail

Hyderabad Police on Alert After Bangaluru Blast :  కర్ణాటక బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్​లో పేలుడు దృష్ట్యా హైదరాబాద్​ నగర పోలీసులు యంత్రాంగం అప్రమత్తమైంది. బెంగళూరులోని కేఫ్​లో పేలుళ్లు నేపథ్యంలో హైదరాబాద్​ పోలీసులు తనిఖీలు చేపట్టారు. జూబ్లీ బస్​ స్టేషన్​, సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​, మారేడుపల్లి గణేశ్​ దేవాలయం, ఓఏసీ సెంటర్​లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఆపి తనిఖీలు చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వారిని గుర్తించి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

Bangaluru Rameshwaram Cafe Blast : శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్​లో పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు తొమ్మిది మందికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ పేలుడు పట్ల ఎన్​ఐఏ, పోరెన్సిక్​ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెంటనే హైదరాబాద్​లో కూడా పోలీసులు అప్రమత్తమై తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.