తెలంగాణ

telangana

మరోసారి ఆశీర్వదిస్తే గజ్వేల్‌ అభివృద్ధిని ఆకాశానికి తీసుకెళ్తా : కేసీఆర్

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 3:47 PM IST

Updated : Nov 28, 2023, 4:17 PM IST

CM KCR Election Campaign in Gajwel : గజ్వేల్‌ నుంచి అవకాశం ఇచ్చి రాష్ట్రానికి సీఎం చేసి పంపారని కేసీఆర్ పేర్కొన్నారు. గజ్వేల్ మీదుగానే ఆర్‌ఆర్‌ఆర్‌ రాబోతోందని ఆయన స్పష్టం చేశారు. 24 ఏళ్లుగా తెలంగాణ ఆశగా, శ్వాసగా బతుకుతున్నానని గజ్వేలు ప్రజలకు చెప్పారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని సమైక్యవాదులు కుట్ర చేశారని ఆరోపించారు. మన ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM KCR Election Campaign in Gajwel
CM KCR

మరోసారి ఆశీర్వదిస్తే గజ్వేల్‌ అభివృద్ధిని ఆకాశానికి తీసుకెళ్తా : సీఎం కేసీఆర్

CM KCR Election Campaign in Gajwel :దేశంలోనేగజ్వేల్‌ ఒక రోల్‌ మోడల్‌గా ఎదిగిందని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో సీఎం కేసీఆర్ తన చివరి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నేతలు గజ్వేల్‌ అభివృద్ధి చూడడానికి తండోపతండాలుగా వచ్చారన్నారు. మిషన్‌ భగీరథ గురించి తెలుసుకునేందుకు భారీగా తరలివచ్చారని చెప్పారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి కోమటిబండ అభివృద్ధి చూశారని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో ఇదే తనకు చివరి సభ అని వివరించారు.

CM KCR Speech at Gajwel BRS Public Meeting : గజ్వేల్‌లో తాను మాట్లాడేది 96వ సభ అని కేసీఆర్ వివరించారు. గజ్వేల్‌ నుంచి అవకాశం ఇచ్చి రాష్ట్రానికి సీఎం చేసి పంపారని సూచించారు. రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి చాలా సాధించుకున్నామని సీఎం పేర్కొన్నారు. గజ్వేల్ మీదుగానే ఆర్‌ఆర్‌ఆర్‌ రాబోతోందని స్పష్టం చేశారు. 24 ఏళ్లుగా తెలంగాణ ఆశగా, శ్వాసగా బతుకుతున్నానని గజ్వేలు ప్రజలకు చెప్పారు. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని సమైక్యవాదులు కుట్ర చేశారని ఆరోపించారు. మన ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధివంచితుల కోసమే పింఛన్లు తీసుకువచ్చామని అన్నారు.

బీఆర్ఎస్ నేతలు దిల్లీ గులాములు కాదు - మాకు ప్రజలే బాసులు : కేసీఆర్

CM KCR at Gajwel BRS Public Meeting :రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వస్తే పింఛన్లను రూ.5 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ హమీ ఇచ్చారు. రైతుబంధు సృష్టించి రైతులను ఆదుకున్నది కేసీఆర్‌ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. 7500 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల ధాన్యం సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. భూములపై ప్రభుత్వం వద్ద ఉన్న అధికారాన్ని రైతులకు ధారపోశామని వివరించారు. రైతుల భూములను మార్చే అధికారం సీఎంకు కూడా లేదని చెప్పారు. ప్రతిపక్షాలు రైతుబంధు దుబారా చేస్తున్నట్లు విమర్శిస్తున్నారని సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు.

రైతులకు 24 గంటల విద్యుత్‌ కావాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని సీఎం కేసీఆర్ ప్రజలకు సూచించారు. పదేళ్లుగా దేవుడి దయతో కరవు లేదని.. వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేసుకున్నామని.. జిల్లాకో వైద్య కళాశాలల ఏర్పాటు చేసుకున్నామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందని చెప్పారు. సాధించిన రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చుకున్నామన్నారు. తెలంగాణ అద్భుత రాష్ట్రంగా మారాలని సూచించారు.

కాంగ్రెస్‌ నేతలు పెట్టేది భూమాత కాదు భూ'మేత' - ధరణి తీసేస్తే మళ్లీ దళారీల రాజ్యమే : సీఎం కేసీఆర్

CM KCR Gajwel Election Campaign :నిరక్షరాస్యత లేని రాష్ట్రంగా తయారు కావాలన్న సీఎం.. పేదలు లేని తెలంగాణ రూపుదిద్దుకోవాలన్నారు. బీఆర్ఎస్ వస్తే గజ్వేల్‌లో ఒకే విడతలో దళితబంధు అమలు చేస్తామని హమీ ఇచ్చారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీగా తెలంగాణ తయారుకావాలని కోరారు. భగవంతుడు తనకు ఇచ్చిన శక్తి మేరకు కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. కొండపోచమ్మ ఆలయాన్ని అద్భుతంగా మార్చుకుందామని తెలిపారు. గజ్వేల్‌కు కచ్చితంగా ఐటీ టవర్లు తీసుకువస్తామని హమీ ఇచ్చారు.

'తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది. సాధించిన రాష్ట్రాన్ని ఒక దరికి తెచ్చుకున్నాం. తెలంగాణ అద్భుత రాష్ట్రంగా మారాలి. నిరక్షరాస్యత లేని రాష్ట్రంగా తయారు కావాలి. పేదలు లేని తెలంగాణ రూపుదిద్దుకోవాలి. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కార్యక్రమాలు చేపట్టా. గజ్వేల్‌కు కచ్చితంగా ఐటీ టవర్లు తీసుకువస్తాం. మున్ముందు గజ్వేల్‌కు డజను పరిశ్రమలు వస్తాయి. మరోసారి ఆశీర్వదిస్తే గజ్వేల్‌ అభివృద్ధిని ఆకాశానికి తీసుకెళ్తా.' -కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి

ప్రతి మండల కేంద్రంలో మార్కెట్‌యార్డులు ఏర్పాటు చేద్దామని సీఎం పేర్కొన్నారు. మల్లన్నసాగర్‌ను పర్యాటక ప్రాంతంగా తయారు చేస్తామని చెప్పారు. 12 జిల్లాలకు నీళ్లు తరలించే విధంగా గజ్వేల్‌ మారిందని వివరించారు. మున్ముందు గజ్వేల్‌కు డజను పరిశ్రమలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కులం, మతం, జాతి తేడా లేకుండా ఉండడం వల్లే అభివృద్ధి సాధ్యమైందని స్పష్టం చేశారు. మరోసారి ఆశీర్వదిస్తే గజ్వేల్‌ అభివృద్ధిని ఆకాశానికి తీసుకెళ్తానని సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రజలను కోరారు.

ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్​ ఎందుకు పార్టీ పెట్టారు : కేసీఆర్​

Last Updated :Nov 28, 2023, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details