ETV Bharat / state

ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్​ ఎందుకు పార్టీ పెట్టారు : కేసీఆర్​

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 2:51 PM IST

cm kcr public meeting in warangal
cm kcr warangal

CM KCR Public Meeting in Warangal : ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్​ ఎందుకు పార్టీ పెట్టారని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ అన్నారు. తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది కాంగ్రెస్సేనని విమర్శించారు. వరంగల్​లో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.

CM KCR Public Meeting in Warangal : తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలకు వరంగల్​ వేదికగా నిలిచిందని.. ఆ సమయంలో అతిపెద్ద బహిరంగ సభ ఇక్కడే నిర్వహించామని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​(CM KCR) అన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడు జరుగుతున్నది 95వ సభ అని పేర్కొన్నారు. వరంగల్​ ఈస్ట్​, వరంగల్​ వెస్ట్​ నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడిగా వరంగల్​ జిల్లాలో బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)ను నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్​ పాల్గొని.. మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ పార్టీపై విమర్శలు చేశారు.

తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది.. కాంగ్రెస్సేనని సీఎం కేసీఆర్​ తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్​ ఎందుకు పార్టీ పెట్టారని ధ్వజమెత్తారు. 10 ఏళ్ల బీఆర్​ఎస్​ పాలన.. గత 50 ఏళ్ల కాంగ్రెస్​ పాలనను బేరీజు వేసుకోవాలని వరంగల్​ ప్రజలకు సూచించారు. 24 గంటల కరెంటు గురించి కాంగ్రెస్​ నేతలు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్ నేతలు దిల్లీ గులాములు కాదు - మాకు ప్రజలే బాసులు : కేసీఆర్

BRS Praja Ashirvada Sabha at Warangal : కొన్ని రోజుల్లోనే వరంగల్​లో టెక్స్​టైల్​ ఇండస్ట్రీలో(Warangal Textile Park) లక్ష మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. నిరుపేదలకు అనేక కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. రెండేళ్లలో టెక్స్​టైల్​ పార్క్​లో మహిళలకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరాన్ని మూడోసారి బీఆర్​ఎస్​ వస్తే మరింత అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. 24 అంతస్తుల కొత్త ఎంజీఎం భవనం.. హైదరాబాద్​లో కూడా లేదని సీఎం కేసీఆర్​ హర్షించారు. ఈ ఒక్క భవనం చాలు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవడానికి అని చెప్పారు. ఈ ఎన్నికలో గెలిస్తే ఆటో రిక్షాల కార్మికులకు.. ఫిట్​నెస్​ సర్టిఫికేట్​ పర్మిట్​ టాక్స్​ను రద్దు చేస్తామన్నారు.

"తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమే బీఆర్​ఎస్​ పార్టీ పుట్టింది. 50 ఏళ్ల దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్​ ఏం చేసింది. ఈ పదేళ్ల బీఆర్​ఎస్​ పాలన, గత 50 ఏళ్ల కాంగ్రెస్​ పాలనను బేరీజు వేసుకోవాలి. ఇందిరమ్మ రాజ్యమే సరిగా ఉంటే ఎన్టీఆర్​ ఎందుకు పార్టీ పెట్టారు. నాటి ఇందిరమ్మ పాలనలో అన్నం కోసం పేద బతుకులు ఎంతో అలమటించాయి. కానీ ఎన్టీఆర్​ రెండు రూపాయలకే కిలో బియ్యంతో వారి ఆకలి తీర్చారు." - కేసీఆర్​, బీఆర్​ఎస్​ అధ్యక్షుడు

CM KCR Election Campaign at Warngal : ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి ఇంకా రాలేదని సీఎం కేసీఆర్​ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసమే బీఆర్​ఎస్(BRS)​ పుట్టిందన్నారు. దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్​ వన్​ స్థానంలో ఉందన్నారు. కంటి వెలుగు(Kanti Velugu) కార్యక్రమం ఉంటుందని ఎవరూ ఏనాడూ కలలో కూడా అనుకోలేదన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి.. 80 లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చామని ఆనందించారు. ఎన్నికల తర్వాత పింఛన్​ను రూ.5 వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.

ఇందిరమ్మ రాజ్యం సరిగ్గా ఉంటే ఎన్టీఆర్​ ఎందుకు పార్టీ పెట్టారు సీఎం కేసీఆర్​

నేను బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు : కేసీఆర్

కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదుతో - రైతుబంధును ఈసీ మళ్లీ ఆపేసింది : కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.