తెలంగాణ

telangana

MP Arvind in Lok Sabha: 'బియ్యం కుంభకోణంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలి'

By

Published : Dec 6, 2021, 6:25 PM IST

Updated : Dec 6, 2021, 7:22 PM IST

MP Arvind
'బియ్యం కుంభకోణంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలి'

MP Arvind in Loksabha: రాష్ట్ర ప్రభుత్వంపై నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ లోక్​సభలో మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై శూన్య గంటలో అర్వింద్​ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వరి ధాన్యం సేకరించట్లేదని ఆరోపించారు. ఆలస్యంగా కొనుగోళ్ల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

'బియ్యం కుంభకోణంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలి'

MP Arvind in Lok Sabha:రాష్ట్రంలో రైతుల పరిస్థితిపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్​ లోక్‌సభలో ప్రస్తావించారు. రైతుల పరిస్థితిపై శూన్య గంటలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వరి ధాన్యం సేకరించట్లేదని లోక్​సభలో ఆరోపించారు. ఆలస్యంగా కొనుగోళ్ల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. 2014-2020 వరకు సీఎం సొంత జిల్లాలో 416 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు.

arvind talk about paddy procurement: రాష్ట్ర ధాన్యం కొనబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. 2020-21 నాటికి 3 రెట్లు అధికంగా ధాన్యం సేకరణ చేపట్టినట్లు వెల్లడించారు. పారాబాయిల్డ్ రైస్ సేకరణ తగ్గించాలని కేంద్రం కోరుతోందని తెలిపారు. కొందరు మిల్లర్లు ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం తెస్తున్నారని మండిపడ్డారు. మిల్లర్లు బియ్యం రీసైకిల్ చేసి ఎఫ్‌సీఐకి అమ్ముతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే రైస్‌ మిల్లర్ల కుంభకోణం జరుగుతున్నట్లు ఆరోపించారు. బియ్యం కుంభకోణంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

తెలంగాణలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. సకాలంలో ప్రభుత్వం వరి ధాన్యం సేకరణ చేయకపోవడంతో.. కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 2014 నుంచి 2020 మధ్య కాలంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే 416 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గడచిన 5 సంవత్సరాలలో ఎఫ్​సీఐ ద్వారా మొదట్లో 35.96 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. 2020-21 నాటికి 3 రెట్లు అధికంగా 94.53 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. గత కొన్ని రోజులుగా పార్లమెంట్ సంప్రదాయాలను ఉల్లంఘించి... సభను తప్పుదోవ పట్టించే విధంగా తెరాస ఎంపీలు గొడవ చేస్తున్నారు.

- ధర్మపురి అర్వింద్​, నిజామాబాద్​ ఎంపీ

ఇవీ కూడా చదవండి:

TRS MPs walkout from Lok Sabha: లోక్​సభలో యాసంగిలో ధాన్యం సేకరణపై తెరాస సభ్యులు ఆందోళనకు దిగారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెరాస ఎంపీలు నినాదాలు చేశారు. తెరాస ఎంపీల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. కేంద్రం తీరుకు నిరసనగా లోక్‌సభ నుంచి తెరాస వాకౌట్‌ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Revanth Reddy Fires on KCR: సీఎం కేసీఆర్, తెరాస ఎంపీలపై మరోసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బియ్యం నిల్వల అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్​ను కలిసి ఫిర్యాదు చేద్దామంటే.. అపాయింట్​మెంట్​ లభించడం లేదని అన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated :Dec 6, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details