తెలంగాణ

telangana

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 325 కరోనా కేసులు, ఇద్దరు మృతి

By

Published : Aug 28, 2021, 8:01 PM IST

రాష్ట్రంలో గడిచిన 24గంటల వ్యవధిలో కొత్తగా 325 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మరణించారు. కరోనా నుంచి కొత్తగా 424 మంది కోలుకున్నారు.

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 325 కరోనా కేసులు, ఇద్దరు మృతి
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 325 కరోనా కేసులు, ఇద్దరు మృతి

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 78,787 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 325 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,57,119కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 3,869కి చేరింది.

ఒక్కరోజు వ్యవధిలో 424 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,47,185కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,065 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదీ చదవండి:Covaxin Vaccine: వారికి కొవాగ్జిన్​ ఒక్క డోసు చాలు!

ABOUT THE AUTHOR

...view details