A young woman Raped Bandlaguda in Hyderabad : సమాజంలో రోజురోజుకూ అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆడపిల్ల అయితే చాలనుకుని కొందరు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. వావివరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.
Bandlaguda Rape Case : తాజాగా ఓ యువతి ఇంట్లో గొడవ పెట్టుకొని హైదరాబాద్కు వచ్చింది. అక్కడ పరిచయమైన ఇద్దరు వ్యక్తులతో తనకు పోలీస్స్టేషన్కు దారి చెప్పాలని కోరింది. అందుకు సరేనన్న వారు, ఆ అమ్మాయిని బైక్పై ఎక్కించుకొని, ఓ గోడౌన్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి (Bandlaguda Rape Case) ఒడిగట్టారు. ఈ ఘటన హైదరాబాద్లోని పాతబస్తీ బండ్లగూడ పీఎస్ పరిధిలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది.
మైనర్పై రెండేళ్లుగా రేప్.. దోషికి 142ఏళ్ల శిక్ష.. పోక్సో కోర్టు సంచలన తీర్పు
ఇందుకు సంబంధించి ఇన్స్పెక్టర్ మహ్మద్ షాకీర్ అలీ తెలిపిన వివరాల ప్రకారం,సూర్యాపేటకు చెందిన యువతి(21) తన తల్లి, సోదరుడితో కలిసి ఇంట్లోనే ఉంటోంది. శనివారం ఏదో విషయమై ఆమెకు, తన సోదరుడితో గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన సోదరుడు ఆ అమ్మాయిని కొట్టాడు. ఈ విషయమై మనస్తాపానికి గురైన యువతి, బస్టాండుకు వచ్చి హైదరాబాద్ బస్సు ఎక్కింది. శనివారం రాత్రి 10:40 గంటల ప్రాంతంలో మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఎంజీబీఎస్)లో దిగింది.
Rape Cases in Hyderabad :బయటికి వచ్చి టీ తాగిన తరువాత అఫ్జల్గంజ్ వైపు నడుచుకుంటూ వస్తోంది. ఆ యువతిని చూసిన గౌస్నగర్కు చెందిన ములకలపెంట శ్రీకాంత్ (22), అఫ్జల్గంజ్కు చెందిన పానగంటి కాశీ విశ్వనాథ్(32)లు ఆమెను ద్విచక్రవాహనంపై వెంబడించారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఎక్కడికెళ్లాలని అడగ్గా, సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లాలని చెప్పింది. తాము అక్కడికే వెళ్తున్నామని, నిన్నూ తీసుకెళ్తామని చెప్పి బైకు ఎక్కమన్నారు. వారిని నమ్మిన యువతి సరేనని ద్విచక్రవాహనం ఎక్కింది.