ఉద్యోగం పేరుతో 'ఆమె'ను వ్యభిచార ఊబిలోకి నెట్టిన అంకుల్​.. నడిరోడ్డుపై దారుణ హత్య

author img

By

Published : Sep 14, 2022, 1:44 PM IST

crime news

మైనర్​కు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లి వ్యభిచారం చేయించాడు ఆమె మేనమామ. బాలికకు సంబంధించిన ఓ అశ్లీల వీడియో వైరల్​ కావడం వల్ల ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. మరోవైపు, పట్టపగలే నడిరోడ్డుపై ఓ యువకుడ్ని గొంతునులిమి చంపేశాడు దుండగుడు. మధ్యప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

గుజరాత్​లోని దారుణ ఘటన వెలుగు చూసింది. మైనర్​కు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకెళ్లి.. ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించాడు ఆమె మేనమామ. అయితే బాలికకు సంబంధించిన ఓ అశ్లీల వీడియో బయటకు రావడం వల్ల ఆమె గ్రామస్థులకు విషయం తెలిసింది. వెంటనే బాధితురాలి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఝార్ఖండ్​కు చెందిన ఓ 13 ఏళ్ల బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గుజరాత్​ తీసుకెళ్లాడు ఆమె మేనమామ. అక్కడ ఓ కంపెనీలో ఆమె నెలరోజులు పనిచేసింది. ఏవో కారణాలతో ఆ కంపెనీ మూతపడింది. దీంతో తనను ఇంటికి తీసుకెళ్లమని ఆమె అడిగింది. లేకపోతే వేరే కంపెనీలోనైనా ఉద్యోగం ఇప్పించమని కోరింది. అప్పుడు ఆమెను తన మేనమామ ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం వేరే వారితో వ్యభిచారం చేయమని చెప్పాడు. అందుకు ఆమె నిరాకరించడం వల్ల బలవంతంగా చేయించాడు.

అయితే కొన్నిరోజుల తర్వాత బాలికను తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. అదే సమయంలో బాధితురాలికి సంబంధించిన ఓ అశ్లీల వీడియో వైరల్​ అయింది. అది చూసిన గ్రామస్థులు.. బాలికను వ్యభిచార ఊబిలోకి నెట్టిన ఆమె మేనమామతో పాటు అతడి భార్యను బంధించారు. అయితే వారిద్దరూ చాకచక్యంగా తప్పించుకుని పారిపోయారు. దీంతో గ్రామస్థులంతా పోలీస్​ స్టేషన్​కు వెళ్లి బాధితురాలికి న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'న్యాయం జరిగితేనే అంత్యక్రియలు'.. పట్టుబట్టి కూర్చున్న కుటుంబీకులు
మరోవైపు.. తమ కుమార్తెపై జరిగిన దారుణానికి న్యాయం జరగకపోతే మృతదేహానికి అంత్యక్రియలు చేయబోమని మృతురాలి కుటుంబసభ్యులు పట్టుబట్టి కూర్చున్నారు. దహన సంస్కారాలు జరుపకుండా మృతదేహాన్ని ఉప్పుతో కప్పివేసి 42 రోజులుగా అలానే ఉన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నందురుబార్​ జిల్లాలో జరిగింది.

ఉప్పులోనే వివాహిత మృతదేహం
ఉప్పులోనే వివాహిత మృతదేహం

బాధితురాలి తండ్రి చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ధడ్‌గావ్ ప్రాంతానికి చెందిన ఓ వివాహితను ఆగస్టు 1న బలవంతంగా కొందరు వ్యక్తులు కారులో ఎక్కించి తీసుకెళ్లారు. అయితే కొద్దిసేపటికే వావి ప్రాంతంలోని మామిడి చెట్టుకు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులకు ఫోన్‌ వచ్చింది. ఘటనాస్థలికి తాము చేరుకునేలోపే నిందితులు.. తమ కుమార్తె మృతదేహాన్ని కిందకు దించి సాక్ష్యాలను ధ్వంసం చేశారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెపై రంజిత్​తో పాటు అతడి స్నేహితులు అత్యాచారానికి పాల్పడ్డారని, అది పోలీసులకు చెబుతున్నా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. అయితే పోలీసులు.. బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షలు చేయించారు. ఆ నివేదిక ప్రకారం ఆత్మహత్య కేసు నమోదు చేశామని చెబుతున్నారు.

పట్టపగలే నడిరోడ్డుపై దారుణం..
మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో దారుణం జరిగింది. పితంపుర్​​ పోలీస్​స్టేషన్​ పరిధికి చెందిన సంతోష్​ ఖాటిక్​ అనే యువకుడ్ని పట్టపగలే నడిరోడ్డుపై గొంతు నులిమి హత్య చేశాడు ఓ దుండగుడు. ఆ సమయంలో స్థానికులు వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు. వైరల్​గా మారిన వీడియా.. పోలీసుల దృష్టికి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు. వీడియో ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

పెళ్లి చేసుకుంటానని చెప్పి నటిపై అత్యాచారం..
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ సినీ నటిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. మహారాష్ట్రలోని ముంబయికు చెందిన ఆదిత్య అజయ్​ కపూర్​.. స్థానికంగా నివాసం ఉంటున్న 24 ఏళ్ల నటిని పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. తీరా పెళ్లి చేసుకోమని బాధితురాలు అడిగితే దుర్భాషలాడుతూ తన దగ్గర మెసేజ్​లను తన తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నిందితుడ్ని అరెస్ట్​ చేశారు.

ఏడేళ్ల చిన్నారిపై దారుణం..
దిల్లీలోని సీలంపుర్​లో ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి పారిపోయాడు ఓ కామాంధుడు. అయితే వెంటనే ఈ విషయాన్ని చిన్నారి తన తల్లికి చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. అయితే మరుసటి రోజు కూడా ఆ యువకుడు మళ్లీ బాలిక దగ్గరకు వచ్చి లైంగికంగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా బాలిక అరిచింది. వెంటనే అప్రమత్తమైన బాధితురాలి తల్లి, స్థానికులు అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఇవీ చదవండి: ఛత్రపతి శివాజీ వారసుడి కన్నుమూత.. మోదీ సంతాపం

కాంగ్రెస్​కు షాక్.. కాషాయ పార్టీలోకి 8 మంది ఎమ్మెల్యేలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.