తెలంగాణ

telangana

కివీస్​తో టెస్టులకు జట్టు ప్రకటన.. రోహిత్, పంత్​కు విశ్రాంతి

By

Published : Nov 12, 2021, 12:33 PM IST

Updated : Nov 12, 2021, 1:20 PM IST

న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ. రెండు టెస్టుల సిరీస్​లో తొలి మ్యాచ్​కు కోహ్లీ అందుబాటులో ఉండకపోగా, రోహిత్​కు విశ్రాంతినిచ్చారు. దీంతో రహానే కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

Ajinkya Rahane
రహానే

న్యూజిలాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది టీమ్ఇండియా సెలెక్షన్ కమిటీ. రెండు టెస్టుల ఈ సిరీస్​లో తొలి మ్యాచ్​కు కోహ్లీ అందుబాటులో ఉండట్లేదు. దీంతో రహానే కెప్టెన్​గా వ్యవహరించనుండగా.. పుజారా అతడికి డిప్యూటీగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ సిరీస్​ నుంచి రోహిత్, బుమ్రా, షమీ, పంత్​కు విశ్రాంతినిచ్చారు. రెండో టెస్టుకు కోహ్లీ తిరిగివచ్చి జట్టుకు సారథ్యం వహిస్తాడని బీసీసీఐ తెలిపింది.

టెస్టు జట్టు

రహానే (కెప్టెన్), పుజారా, రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్​మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సాహా, భరత్, జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

భారత్-న్యూజిలాండ్‌ షెడ్యూల్‌

మొదటి టీ20 - నవంబరు 17, జైపుర్‌

రెండో టీ20 - నవంబరు 19, రాంచి

మూడో టీ20 - నవంబరు 21, కోల్‌కతా

మొదటి టెస్టు- నవంబరు 25- 29, కాన్పూర్‌

రెండో టెస్టు- డిసెంబరు 3-7, ముంబయి

Last Updated :Nov 12, 2021, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details