ETV Bharat / sports

వచ్చే సీజన్​లో ధోనీ ఆడతాడా? - గుడ్ న్యూస్ చెప్పిన సీఎస్కే సీఈవో - Dhoni IPL 2025

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 7:06 PM IST

Dhoni IPL 2025 CSK CEO Kasi Viswanathan : ఐపీఎల్ - 17లో చైన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్ అని కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Source ANI
Dhoni IPL (Source ANI)

Dhoni IPL 2025 CSK CEO Kasi Viswanathan : ఐపీఎల్ - 17లో చైన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశకే పరిమితమైన సంగతి తెలిసిందే. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. సీఎస్కే ఓటమిని పక్కన పెడితే చాలా మంది ఫ్యాన్స్‌లో ధోనీ రానున్న ఐపీఎల్‌ సీజన్‌ ఆడుతాడా? లేదా? అనే సందేహం ఉంది. ఎందుకంటే మహీకి ఇదే చివరి సీజన్ అని కథనాలు వస్తున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే ధోని ఐపీఎల్‌కి ఇప్పట్లో రిటైర్‌మెంట్‌ ప్రకటించే అవకాశం లేనట్లు కనిపిస్తోంది.

తాజాగా ధోనీ వచ్చే సీజన్​లో ఆడతాదా లేదా అన్న విషయంపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ధోనీ వచ్చే ఏడాది ఆడతాడని ఆశిస్తున్నట్టు తెలిపారు. అంకు ముందు కూడా, అంబటి రాయుడు, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్పతో సహా కొందరు వచ్చే ఏడాది మహీ ఐపీఎల్‌ ఆడుతాడని చెప్పారు.

ఆఫర్ రిజెక్ట్ చేసిన రికీ పాంటింగ్​ - మరి స్టీఫన్​ ఫ్లెమింగ్‌ ఏం అంటున్నాడంటే? - TeamIndia Head coach

IPL​లో ధోనీ బెస్ట్ మూమెంట్స్- ధనాధన్ బ్యాటింగ్​తో ఫ్యాన్స్​ ఖుష్- వీడియోలు చూశారా? - IPL 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.