దక్షిణాదిన ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుక కరోనా కారణంతో మూడేళ్లుగా నిర్వహణకు నోచుకోలేదు. తాజాగా.. 2019 ఏడాదికి సంబంధించి 'సైమా' పురస్కారాల ప్రదానోత్సవాలను ఈ ఏడాది నిర్వహించనున్నారు. ఈ మేరకు 'సైమా' ఛైర్ పర్సన్ బృందాప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే సెప్టెంబర్లో పురస్కార ప్రదానోత్సవం ఉంటుందని ఆమె తెలిపారు.
ఈసారి నామినేట్ అయిన సినిమాలు ఇండస్ట్రీలకు ఒక బెంచ్మార్క్ను నిర్దేశించాయన్నారు. దీంతోపాటు వివిధ విభాగాల్లో నామినేట్ అయిన సినిమాలు.. అత్యంత ఆదరణ పొందిన చిత్రాలుగా మహర్షి(తెలుగు), అసురన్(తమిళం), యజమాన(కన్నడ), కుంబళంగి నైట్స్(మలయాళం) చిత్రాలు నామినేషన్లో ముందంజలో నిలిచాయి.